Begin typing your search above and press return to search.

మహిళపై మొసలి దాడి.. అందరూ చూస్తుండగానే...!

నది ఒడ్డున స్నానం చేస్తున్న మహిళను మొసలి సజీవంగా తినేసింది. ఒడిశాలో జాజ్‌ పూర్ జిల్లాలోని పలాత్‌ పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

By:  Tupaki Desk   |   17 Aug 2023 4:31 PM GMT
మహిళపై మొసలి దాడి.. అందరూ చూస్తుండగానే...!
X

నీటిలో ఉన్న మొసలికి విపరీతమైన బలం ఉంటుందని అంటారు. ఒక మనిషిని లాక్కుని వెళ్లడం దానికి పెద్ద పని కాదు. కాకపోతే దాని నోటికి అందకుండా జాగ్రత్తగా ఉండటమే మన బాధ్యత! ఈ నేపథ్యంలో నది ఒడ్డున స్నానం చేస్తోన్న మహిళను మొసలి లాక్కెల్లి మింగేసిన సంఘటన తాజాగా జరిగింది.

అవును... నది ఒడ్డున స్నానం చేస్తున్న మహిళను మొసలి సజీవంగా తినేసింది. ఒడిశాలో జాజ్‌ పూర్ జిల్లాలోని పలాత్‌ పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బిరుపా నది దగ్గర ఒక మహిళ (35) స్నానం చేసుండగా సడన్ గా వచ్చిన ఓ మొసలి ఆమెను అమాంతం నీటిలోకి లాగింది.

ఈ సమయంలో ఆమెను కాపాడాలని జనం ప్రయత్నించినప్పటికీ ఆ మొసలి ఛాన్స్ ఇవ్వలేదు. చూస్తుండగానే బాధితురాలు దానికి ఆహారమైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నదిలో గాలింపు చర్యలు చేపట్టి మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు.

మొసలి మహిళపై దాడి చేస్తున్న సమయంలో అక్కడికి దగ్గరలో వున్న వారు సెల్‌ ఫోన్‌ లో వీడియో తీశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది.

కాగా... కొద్దిరోజుల క్రితం బీహార్‌ లోని హాజీపూర్‌ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నదిలో స్నానానికి వెళ్లిన చిన్నారిపై మొసలి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన చిన్నారి బంధువులు, గ్రామస్తులు మొసలిని నదిలో నుంచి బయటకు తీసి కొట్టి చంపారు.