Begin typing your search above and press return to search.

లాజిక్ మిస్.. దాడులు చేస్తే సానుభూతి కాంగ్రెస్సే కే కదా?

ఇదిలా పెరిగితే.. సానుభూతి కాంగ్రెస్ కే ఉంటుందని.. తద్వారా అధికార బీఆర్ఎస్.. బీజేపీలు నష్టపోవటం ఖాయమంటున్నారు.

By:  Tupaki Desk   |   10 Nov 2023 4:23 AM GMT
లాజిక్ మిస్.. దాడులు చేస్తే సానుభూతి కాంగ్రెస్సే కే కదా?
X

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నట్లుగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా సానుకూల వాతావరణం నెలకొందని.. హస్తం గాలి వీస్తుందన్న విషయాన్ని అధికార పార్టీ నేతలు సైతం ఒప్పుకుంటున్న వేళ.. ఆ పార్టీ నేతల దూకుడుకు కళ్లాలు వేసేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పొంగులేటి ఇంట్లో నిర్వహించిన ఐటీ దాడులు కొత్త పరిణామాలకు తెర తీస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ కు కంట్రోల్ చేసేందుకు.. ఆ పార్టీ అభ్యర్థులను ఆందోళనకు గురి చేయటమే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్నాయన్న భావన అంతకంతకూ పెరుగుతోంది.

ఇదిలా పెరిగితే.. సానుభూతి కాంగ్రెస్ కే ఉంటుందని.. తద్వారా అధికార బీఆర్ఎస్.. బీజేపీలు నష్టపోవటం ఖాయమంటున్నారు. ఎవరెన్ని చెప్పినా.. తెలంగాణలోని అత్యధికులు అధికార బీఆర్ఎస్ కు.. బీజేపీకి మధ్య అనధికార అవగాహన ఉంటుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ తో తమకు ఎలాంటి లింకులు లేవని ఎంత బలంగా వాదిస్తున్నా.. ఆ రెండు పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మట్లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఇలాంటి వేళ.. కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో జరుగుతున్న సోదాలు.. దాడులు.. తనిఖీలు మొత్తం కూడా బీఆర్ఎస్ స్క్రిప్టును బీజేపీ పెద్దలు అమలు చేస్తున్న అభిప్రాయం అంతకంతకూ పెరుగుతోంది. ఐటీ సోదాల మీద ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల మరింత సానుభూతిని ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో.. బీజేపీ.. బీఆర్ఎస్ వేధింపులకు.. అధికారిక దాడులకు తాము బెదిరేది లేదని.. వాటిని బలంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.

నిజానికి ఐటీ.. ఈడీ దాడులు చేయాలనుకున్నప్పటికీ.. కీలకమైన ఎన్నికల వేళలో చేయకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ.. ఐటీ.. ఈడీశాఖలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నట్లు చెప్పినా.. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయే ఎన్నికల వేళలో.. ఈ తనిఖీలు చేయాల్సిన అవసరం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే తనిఖీలు చేపట్టాలంటే మరో 20 రోజుల తర్వాత కూడా నిర్వహించొచ్చని.. ఇప్పుడే అంత తొందర ఎందుకు? అన్న ప్రశ్న పలువురి వినిపిస్తోంది.

తమను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న తనిఖీలపై రేవంత్ రెడ్డి అండ్ కో తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు.. బలహీనమైన ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు అధికారంలో ఉన్న వారు వ్యవస్థల్ని తమకు అనుకూలంగా వాడుకోవటం మిస్ ఫైర్ అవుతుందని.. బూమ్ రాంగ్ పద్దతిలో వారికే నష్టం వాటిల్లేలా చేస్తుందన్న మాట బలంగా వినిపిస్తుంది. గదిలో పడేసి కొట్టాలే కానీ పిల్లి సైతం పులిగా మారుతుంది కదా? మరీ.. చిన్న లాజిక్ అంత పెద్ద వ్యవస్థల్ని నడిపేవారు ఎందుకు మిస్ అవుతున్నట్లు? అన్నది ప్రశ్న.