చైనా పాపం పండించిన ట్రంప్ సుంకం.. ఇరుగు పొరుగుతో స్నేహం
లాంటి దేశాన్ని ఒక్కసారిగా కళ్లు తెరిచేలా చేశాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లు.
By: Tupaki Desk | 11 April 2025 10:00 PM ISTదాదాపు 95 లక్షల చదరపు కిలోమీటర్లు. . ఇదీ చైనా విస్తీర్ణం.. అయితే, ఇందులో సగం వివిధ ప్రాంతాలను (టిబెట్, మంగోలియా తదితర) ఆక్రమించి కలుపుకొన్నదే. తైవాన్ కూడా తమదే అంటుంటుంది చైనా. ఆ దేశ నాయకుల ధోరణి ఒక్కటే.. అదే విస్తరణ వాదం.
భారత్ లోని లద్దాఖ్ (ఆక్సాయ్ చిన్), అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటుంది.. పాకిస్థాన్ నుంచి కూడా కొంత కశ్మీర్ భూభాగాన్ని పొందింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక ఇలా పలు దేశాలకు సాయం చేస్తూ వాటి భూభాగాలపై పట్టు సాధిస్తుంటుంది చైనా. అలాంటి దేశాన్ని ఒక్కసారిగా కళ్లు తెరిచేలా చేశాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లు.
10, 20 కాదు ఏకంగా 145 శాతం.. మిగతా దేశాలైతే ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు కళ్లే తేలేసేవి. కానీ, చైనా కదా.. కాస్త తెలివిగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు ఇరుగుపొరుగు దేశాల భూభాగాల మీద కన్నేసే దుర్బుద్ధి ఉన్న డ్రాగన్.. ఇప్పుడు వీటిని వ్యాపారానికి వాడుకోవాలని చూస్తోంది.
విస్తరణ వాదమే కాదు ఫక్తు వ్యాపారి చైనా. చీప్ గా వస్తువులను తయారు చేసి ఎగుమతులు చేయడం ఆ దేశ డెవలప్ మెంట్ రహస్యం. ట్రంప్ దెబ్బతో తమ ఎగుమతులు దెబ్బతినకుండా ముందుజాగ్రత్త పడుతోంది.
జిన్ పింగ్ బయల్దేరాడు..
ట్రంప్ మెడలు వంచడంతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇప్పుడు పొరుగు దేశాల్లో పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారట. అందులోభాగంగా ఈ నెల 14 నుంచి 18 మధ్య ఆగ్నేయాసియాలోని వియత్నాం, మలేసియా, కంబోడియా దేశాల్లో పర్యటించనున్నారు. కాగా, ఇప్పటికే చైనా భారత్ కు స్నేహ హస్తం అందించిన సంగతి తెలిసిందే. అంటే ఆసియా దేశాలను తనవైపు తిప్పుకొనే ప్రయట్నం చేస్తోంది డ్రాగన్.
ఆసియాన్ గ్రూప్ దేశాలైన వియత్నా, మలేసియా, కంబోడియాలు చైనాకు మధ్య ఏటా 962 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. దీనిలో 575 బిలియన్ డాలర్లు చైనా ఎగుమతులే.
చైనా మినహా అన్ని దేశాలపై ట్రంప్ టారిఫ్ లు 90 రోజుల పాటు నిలిపివేశారు. అయితే, చైనాపై సుంకాలను 145 శాతం చేశారు. దీంతో అమెరికా ఉత్పత్తులపై చైనా ఇప్పుడు టారిఫ్ లను 125 శాతానికి పెంచింది. తద్వారా ఏమాత్రం తగ్గబోమని స్పష్టం చేసింది.
ఇప్పటికే అమెరికా ఫిల్మ్ ల దిగుమతులను చైనా తగ్గించింది. ఈ యుద్ధంలో ఎంతవరకైనా వెళ్తామని ప్రకటించింది.