Begin typing your search above and press return to search.

కన్నీటి వీడ్కోలు... రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు!

ఈ సమయంలో స్మృతివనం వద్ద నివాళులర్పించిన చంద్రబాబు... రామోజీరావు పాడెను మోశారు. దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   9 Jun 2024 7:03 AM GMT
కన్నీటి వీడ్కోలు... రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు!
X

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, మీడియా మొగల్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పలు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇది యావత్ దేశానికే తీరని లోటని కొనియాడారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రామోజీ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు! ఈ సమయంలో.. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం రామోజీరావు అంతిమయాత్ర ప్రారంభమైంది.

ఈ క్రమంలో తాజాగా ఆయన అంతిమయాత్ర స్మృతివనం వద్దకు చేరుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన ఈ అంతిమయాత్ర... రామోజీ గ్రూపు సంస్థల కార్యాలయాల మీదుగా స్మారక కట్టడానికి చేరింది. ఈ అంత్యక్రియలకు టీడీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు.

ఈ సమయంలో స్మృతివనం వద్ద నివాళులర్పించిన చంద్రబాబు... రామోజీరావు పాడెను మోశారు. దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి. చంద్రబాబుకు - రామోజీరావుకు ఉన్న సాన్నిహిత్యాన్ని, ఒకరిపై ఒకరికున్న ఆత్మీయతను, గౌరవాన్ని, అభిమానాన్ని ఈ విషయం మరింత బలంగా నిరూపించిందని అంటున్నారు.

ఇదే సమయంలో... రామోజీ అంతిమయాత్రకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.