ఎంపీల మీద పెద్ద బాధ్యత పెట్టిన బాబు
ఏపీలో టీడీపీ కేంద్రంలో అధికార ఎన్డీయేలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి విధితమే. టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలే కేంద్ర ప్రభుత్వం మనుగడుకు ప్రధాన ఆధారంగా ఉన్నారు.
By: Satya P | 28 Nov 2025 6:00 AM ISTఏపీలో టీడీపీ కేంద్రంలో అధికార ఎన్డీయేలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి విధితమే. టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలే కేంద్ర ప్రభుత్వం మనుగడుకు ప్రధాన ఆధారంగా ఉన్నారు. దాంతో గతంతో పోలిస్తే టీడీపీ ఎంపీల పాత్ర పార్లమెంట్ లో చాలా ఎక్కువగా పెరిగింది. ఒక వైపు అధికార పక్షంలో ఉంటూనే మరో వైపు విభజన ఏపీకి అవసరం అయిన అన్ని అంశాల మీద పార్లమెంట్ వేదికగా కోరాల్సిన పరిస్థితి ఉంది ఏపీ ప్రయోజనాల విషయంలో పట్టుబట్టాల్సి ఉంది. దాంతో టీడీపీ అధినాయకత్వం ఎంపీల మీద పెద్ద బాధ్యతనే మోపుతోంది.
అనుమతులే ప్రధానం :
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి. దాంతో ఈ సమావేశాలలో చర్చినాల్సిన అంశాల గురించి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన తాజాగా టీడీపీ లోక్ సభ రాజ్యసభ ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ అభివృద్ధి ప్రజా ప్రయోజనాలే అజెండాగా చేసుకుని పార్లమెంట్లో రాష్ట్ర అంశాలు ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. అంతే కాదు ఏపీలో అనేక ప్రాజెక్టులకు అనుమతులు తీసుకుని రావాలని అదే విధంగా రైతు సమస్యలకు పరిష్కారం కూడా కనుగొనాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
యాక్టివ్ కావాల్సిందే :
ఇక చూస్తే అత్యధిక యువ పార్లమెంటేరియన్లు కలిగిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు చెప్పారు.అలా యువ శక్తి పార్లమెంట్ వేదికగా రాష్ట్ర సమస్యలను స్పష్టంగా వినిపించాల్సిన అవసరం ఉందని బాబు కోరారు. రాష్ట్రాభివృద్ధితో పాటుగా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఎంపీలు అంతా సమన్వయంతో కలసి పనిచేయాలని సూచించారు. కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా గోదావరి ట్రైబ్యునల్, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రాన్ని ఒప్పించేలా పార్లమెంట్లో రాష్ట్ర గొంతుకను వినిపించాలని ఎంపీలకు బాబు స్పష్టం చేశారు. అలాగే వంశధార గోదావరి నల్లమల సాగర్ అనుసంధానంతో పాటుగా వెలిగొండ, ఉత్తరాంధ్ర జల ప్రాజెక్టులు ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్ని నిర్ణయిస్తాయని బాబు ఎంపీలకు గుర్తు చేశారు. వీటి కోసం పార్లమెంట్ లో మాట్లాడాలని అన్నారు.
పోలవరం కోసం :
అదే విధంగా విభజన ఏపీకి నీటి భద్రత చాలా ముఖ్యమని జల వనరులే రాష్ట్రానికి ఆస్తి అని బాబు చెప్పారు. ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్టును 2027 జూన్లో జాతికి అంకితం చేసేందుకు కేంద్ర సహకారాన్ని కోరాలని బాబు సూచించారు. పత్తి మొక్కజొన్న అరటి ధరల పతనం కేంద్రం దృష్టికి తేవాలని సీసీఐ నియమాల కారణంగా వచ్చిన సమస్యలను కేంద్రానికి వివరించి రైతులకు ఉపశమనం కల్పించేలా చూడాలని ఎంపీలకు బాబు వివరించారు.
అభివృద్ధి అజెండాతో :
ఏపీలో గ్రోత్ ఇంజన్లుగా అనేక ప్రాజెక్టులు వస్తున్నాయని బాబు చెప్పారు. అలా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్లకు అవసరమైన శక్తి వసతులపై కేంద్ర సహాయం ఎంపీలు పూర్తి స్థాయిలో సాధించాలని కోరారు. ఇక ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఎంఎస్ఎంఈ పార్కులు, 4ఘ్–5ఘ్ కనెక్టివిటీ, క్వాంటం వ్యాలీ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్కు మద్దతు సాధించేలా చూడాలని అన్నారు. విశాఖ–విజయవాడ మెట్రో రైలు, విశాఖ-తిరుపతి-అమరావతి ఎకనామిక్ రీజియన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ రైల్వే జోన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై కేంద్రంతో మాట్లాడి సపోర్టుని తీసుకోవాలని అన్నారు. మొత్తానికి ఈసారి వింటర్ సెషన్ కోసం బాబు తన పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తూనే అనేక కీలక బాధ్యతలను వారి మీద పెట్టారు.
