Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో బాబుది అర్జునుడి పాత్రే.. !

అయితే.. గ‌తానికి భిన్నంగా తాజాగా చేప‌ట్టిన నామినేట‌డ్ ప‌ద‌వుల్లో చంద్ర‌బాబు కేవ‌లం విధేయ‌త‌, విన యానికి మాత్ర‌మే పెద్ద‌పీట వేశారు.

By:  Tupaki Desk   |   12 May 2025 9:30 PM
ఆ విష‌యంలో బాబుది అర్జునుడి పాత్రే.. !
X

కొన్ని కొన్ని విష‌యాల్లో ఎవ‌రు ఏం చెప్పినా..టీడీపీ అదినేత‌గా, సీఎంగా చంద్ర‌బాబు తాను ఎంచుకున్న మార్గంలోనే ప‌య‌నిస్తున్నారు. ఆయ‌న చేయాల‌ని అనుకున్న ప‌నే చేస్తున్నారు. తాజాగా 22 నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌గా.. 16 సొంత పార్టీకి చెందిన వారికి ఇచ్చారు. అయితే.. వాస్త‌వానికి నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో ఐవీఆర్ ఎస్ స‌ర్వేలు..అంత‌ర్గ‌త నివేదిక‌ల‌ను ప‌రిశీలిస్తానని ఆయ‌న ప‌దే ప‌దే చెబుతున్నారు. దీంతో నాయ‌కులు అలెర్ట్ అవుతున్నారు.

అయితే.. గ‌తానికి భిన్నంగా తాజాగా చేప‌ట్టిన నామినేట‌డ్ ప‌ద‌వుల్లో చంద్ర‌బాబు కేవ‌లం విధేయ‌త‌, విన యానికి మాత్ర‌మే పెద్ద‌పీట వేశారు. న‌టించేవారిని.. వంగి వంగి దండాలు పెట్టేవారిని.. ప‌ద‌వుల కోసం పాకులాడేవారిని.. ఆయ‌న పూర్తిగా ప‌క్క‌న పెట్టిన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే.. తీసుకున్న 16 స్థానాల్లో కూడా.. దాదాపు 10 మందికి పైగా.. నాయ‌కులు.. ప‌ద‌వుల కోసం పాకులాడ‌కుండా.. పార్టీకోసం ప‌నిచేసిన వారే ఉన్నారు. వీరికి మాత్ర‌మే చంద్ర‌బాబు పెద్ద పీట వేశారు.

మ‌రోవైపు.. తానే స్వ‌యంగా ఈ విష‌యంలో జోక్యం చేసుకుని ఎంపిక చేసిన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. వాస్త‌వానికి సుగుణ‌మ్మ‌, జవ‌హ‌ర్‌, వ‌ల‌వ‌ల బాబ్జీ, సుబ్బానాయుడు, గ‌న్ని వీరాంజ‌నేయులు, పెద్దిరాజు వంటివారు.. ప‌ద‌వుల కోసం ఎప్పుడూ బ‌య‌ట‌కు వ‌చ్చిన సంద‌ర్భాలు లేవు. కేవ‌లం .. పార్టీ కోసం ప‌నిచేశారు. అంతేకాదు.. అధినేత గీసిన గీత కూడా దాట‌లేదు. ఈ నేప‌థ్యంలో వాస్త‌వానికి ఇలాంటి వారిని తర్వాత జాబితాలో నియ‌మిస్తార నో.. లేక‌.. అప్రాధాన్యం ప‌ద‌వులు ఇస్తార‌నో చ‌ర్చ సాగింది.

కానీ, తాజా నియామ‌కాల్లో మాత్రం వారికి బ‌ల‌మైన పోస్టులే ద‌క్కాయి. ఇదంతా చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అలా కాకుండా.. ఫైర్ బ్రాండ్ల‌కే ఇవ్వాల‌ని అనుకుంటే.. విజ‌య‌వాడ‌కు చెందిన బుద్దా వెంక‌న్న తొలి వ‌రుస‌లో ఉన్నారు. కానీ, ఆయ‌న‌కు అస‌లు ప్రాధాన్యం ద‌క్క‌లేదు. ఇలానే పిఠాపురం వ‌ర్మ స‌హా మ‌రికొంద‌రు కూడా ఉన్నా.. ఈ ద‌ఫా కూడా చంద్ర‌బాబు వారిని ప‌క్క‌న పెట్టి.. విధేయ‌త‌, వివాద‌ర‌హితులు, క‌లివిడిత‌నం.. కూట‌మితో క‌లిసిముందుకు సాగ‌డం వంటి కీల‌క అంశాల‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది.