Begin typing your search above and press return to search.

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా డెవ‌ల‌ప్‌మెంట్‌.. బాబు ప్లాన్ స‌క్సెసేనా ..!

విజ‌న్‌-నియోజ‌క‌వ‌ర్గంలో భాగంగా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల తీరు తెన్నుల‌ను తెలుసుకుంటారు. వ్య‌వ‌సాయ సంబంధ‌మైన నియోజ‌క‌వ‌ర్గం అయితే.. ఆత‌ర‌హా విధానాల‌ను డెవ‌ల‌ప్ చేస్తారు.

By:  Tupaki Desk   |   12 Jun 2025 3:00 AM
నియోజ‌క‌వ‌ర్గాల వారీగా డెవ‌ల‌ప్‌మెంట్‌.. బాబు ప్లాన్ స‌క్సెసేనా ..!
X

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్లాన్ వేస్తే.. స‌క్సెస్ కాకుండా పోతుందా? పైగా ఆయ‌న విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా కూడా పేరు తెచ్చుకు న్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న వేసే వ్యూహాలు.. పెట్టుకునే ల‌క్ష్యాల‌కు కూడా సాధించ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. తాజాగా విజ‌న్ -2047తోపాటు.. విజ‌న్ ఫ‌ర్ కాన్సిట్యుయెన్సీ పేరుతో చంద్ర‌బాబు మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. దీనిని జూన్ 12 నుంచి ప్రారంభించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం కింద‌.. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక విజ‌న్‌గా భావిస్తారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. దీనికి గాను 10 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను కేటాయిస్తారు.

ఈ ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో ఒక కార్యాల‌యాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి ఎమ్మెల్యేనే చైర్మ‌న్‌గా, సార‌థిగా కూడా ఉంటారు. దీనికి స్థానికంగా ఉన్న నాయ‌కుల‌ను కూడా జ‌త చేసుకుని నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి కృషి చేస్తారు. ఈ విజ‌న్ ద్వారా నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌రింత ముందుకు తీసుకువెళ్ల‌డంతోపాటు.. విజ‌న్‌-2047 ల‌క్ష్యం రాష్ట్రానికైతే.. విజ‌న్ -నియోజ‌క‌వ‌ర్గం ల‌క్ష్యం.. నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఉంటుంది. త‌ద్వారా రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా అభివృద్ధిని ప‌రిచ‌యం చేయ‌నున్నారు. దీనిని స‌మ‌గ్రంగా అమ‌లు చేసేలా చంద్ర‌బాబు స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించ‌నున్నారు.

ఏం చేస్తారు?

విజ‌న్‌-నియోజ‌క‌వ‌ర్గంలో భాగంగా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల తీరు తెన్నుల‌ను తెలుసుకుంటారు. వ్య‌వ‌సాయ సంబంధ‌మైన నియోజ‌క‌వ‌ర్గం అయితే.. ఆత‌ర‌హా విధానాల‌ను డెవ‌ల‌ప్ చేస్తారు. అలా కాకుండా.. ఇత‌ర ప్రాధాన్యాలు ఉంటే.. వాటికి ప్రాధాన్యం ఇస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు తూర్పు, ప‌శ్చిమ‌, కృష్ణా జిల్లాలు వ్య‌వ‌సాయ సంబంధ‌మైన జిల్లాలు. దీంతో ఇక్క‌డి నియోజ‌క‌వ‌ర్గాల్లో రైతుల‌కు ప్ర‌ధానంగా ప్రోత్సాహం అందించి..త ద్వారా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధిని సాధించే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడ‌తారు. అదేస‌మ‌యంలో మ‌హిళా సాధికార‌త‌కు కూడా నియోజ‌క‌వ‌ర్గాల స్థాయిలోనే ప్రాధాన్యం పెంచ‌నున్నారు.

ఇక‌, వ్య‌వ‌సాయేత‌ర నియోజ‌క‌వ‌ర్గాలైన క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం వంటి జిల్లాల్లో ప్ర‌తినియోజ‌క‌వ‌ర్గంలో స్థానికంగా ఉత్ప త్తుల‌ను ప్రోత్స‌హించ‌నున్నారు. అదేవిధంగా పునరుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌కు ప్రోత్స‌హిస్తారు. త‌ద్వారా.. నియోజ‌క‌వ‌ర్గంలోనే స్వ‌యంగా ఆదాయం సంపాయించుకునే మార్గాల‌ను అన్వేషించ‌నున్నారు. ఇలా.. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌చ్చే రెండేళ్ల‌లోనే అద్భుతంగా త‌యారు చేయాల‌న్న‌ది సీఎం ల‌క్ష్యం. ఇక‌, ఉమ్మ‌డిగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు క‌లిపి విద్య‌, వైద్యం, ఇత‌ర మౌలిక స‌దుపాయాల‌ను కూడా క‌ల్పిస్తారు. దీనికి ప్ర‌త్యేకంగా నిధులు కేటాయించ‌నున్నారు. ఇలా.. రాష్ట్ర స్థాయిలో నే కాకుండా.. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలోనూ విజ‌న్‌ను ప‌రిచ‌యం చేయాల‌న్న‌ది చంద్ర‌బాబు ల‌క్ష్యం.