Begin typing your search above and press return to search.

మోడీకి థాంక్స్ చెప్పిన రేవంత్ రెడ్డి.. రాహుల్ క్రెడిట్!

ఈ సందర్భంగా స్పందించిన రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని ప్రభావితం చేశారని.. కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడిందని అన్నారు.

By:  Tupaki Desk   |   30 April 2025 4:20 PM
మోడీకి థాంక్స్  చెప్పిన రేవంత్  రెడ్డి.. రాహుల్  క్రెడిట్!
X

దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఇలా.. నేడు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు.

అవును... కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వేళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర క్యాబినెట్ ను అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో.. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీ విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని ప్రభావితం చేశారని.. కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడిందని అన్నారు. ఇదే సమయంలో... దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణా అని.. రాహుల్ గాంధీ విజన్ తోనే రాష్ట్రంలో కులగణన చేపట్టామని రేవంత్ తెలిపారు.

ఇదే సమయంలో... కులగణనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ విజయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించడం హర్షించదగిన అంశమని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఎట్టకేలకు ప్రజల ఒత్తిడితో కులగణనకు ఒప్పుకొందని తెలిపారు.

కాగా... వచ్చే జనాభా లెక్కల్లో కులగణనను కూడా చేర్చుతున్నట్లు ప్రకటించిన అనంతరం మంత్రి వైష్ణవీ అశ్విన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కుల గణనను కేవలం రాజకీయ సాధనంగా మాత్రమే ఉపయోగించుకున్నారని అన్నారు.

అయితే.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం అలాంటి సర్వేలను పూర్తిగా రాజకీయ కోణం నుంచి పాదర్శకత లేకుండా నిర్వహించాయని పేర్కొన్నారు. ఇటువంటి సర్వేలు సమాజంలో పలు సందేహాలు సృష్టించాయని మంత్రి వైష్ణవ్ తెలిపారు.