బ్రేకింగ్... జమ్మూకాశ్మీర్ లో మళ్లీ కాల్పులు మొదలుపెట్టిన పాక్?
మరోవైపు.. ఏదైనా కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగితే వెంటనే స్పందించాలని బీ.ఎస్.ఎఫ్.ని ఆదేశించినట్లు కథనాలొస్తున్నాయి.
By: Tupaki Desk | 10 May 2025 10:01 PM ISTశనివారం సాయంత్రం ఐదు గంటల నుంచే భారత్ – పాక్ ల మధ్యకాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి మొదలు భారత్, పాక్ దేశాల విదేశీ మంత్రిత్వ శాఖల నుంచి వరుస ప్రకటనలు విడుదలయ్యాయి. కట్ చేస్తే... ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే సరిహద్దుల్లో పాక్ మళ్లీ కాల్పులు మొదలుపెట్టిందని అంటున్నారు.
అవును... కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ఇరు దేశాలు ప్రకటించిన గంటల్లోనే అంతర్జాతీయ సరిహద్దులోనూ, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఏదైనా కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగితే వెంటనే స్పందించాలని బీ.ఎస్.ఎఫ్.ని ఆదేశించినట్లు కథనాలొస్తున్నాయి.
నివేదికల ప్రకారం... శ్రీనగర్ లో పలు చోట్ల పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి! ఇదే సమయంలో.. ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది! రాజస్థాన్ లోని పోఖ్రాన్ తో పాటు కాశ్మీర్ లోని బారాముల్లాలోనూ భారత దళాలు ఓ డ్రొన్ ను కూల్చివేసినట్లు తెలుస్తోంది. రాజౌరి, అఖ్నూర్ లలో పాక్ సైన్యం ఫిరంగి దాడులకు పాల్పడిందని సమాచారం!
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా... "కాల్పుల విరమణకు ఇప్పుడేం జరిగింది? శ్రీనగర్ అంతటా పేలుళ్లు వినిపించాయి!!" అని పోస్ట్ చేశారు.