Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు 'మాస్టారు'.. కొత్త అవ‌తారం ఎత్తిన టీడీపీ అధినేత‌

కానీ దాదాపు అర‌గంట‌ కు పైగానే చంద్ర‌బాబు ఇలా మాస్టారు మాదిరిగా వివ‌రించ‌డం.. లెక్క‌లు చెప్ప‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

By:  Tupaki Desk   |   27 July 2023 3:45 AM GMT
చంద్ర‌బాబు మాస్టారు.. కొత్త అవ‌తారం ఎత్తిన టీడీపీ అధినేత‌
X

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా మాస్టారు అవ‌తారం ఎత్తారు. పెద్ద బోర్డు, భారీ స్టిక్కు ప‌ట్టుకుని పాఠాలు చెప్పారు. అయితే.. ఇదంతా కూడా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌. కానీ,దాదాపు అర‌గంట‌ కు పైగానే చంద్ర‌బాబు ఇలా మాస్టారు మాదిరిగా.. వివ‌రించ‌డం.. లెక్క‌లు చెప్ప‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. విష‌యం లోకి వెళ్తే.. తాజాగా తెలంగాణ నీటి ప్రాజెక్టుల‌ పై రాష్ట్రం లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు గ‌త ప్ర‌భుత్వానికి, ప్ర‌స్తుత జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య వ్య‌త్యాసాన్ని చూపిస్తూ.. ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటే ష‌న్ ఇచ్చారు.

ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులు నాశనమైన తీరున చంద్ర‌బాబు స‌మ‌గ్రంగా వివరించారు. "రాయలసీమ రాళ్ల సీమ కాకూడదంటూ తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి ఊపిరి పోసిన వ్యక్తి ఎన్టీఆర్‌. దేశం లో ఏ రాష్ట్రానికీ లేని నదీవనరులు మనకు ఉన్నాయి. నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఎకరా కు నీరు ఇవ్వొచ్చు. నీటిపారుదలశాఖ ను నాశనం చేసిన జగన్‌ సమాధానం చెప్పాలి. సీమకు తీరని ద్రోహం చేసిన పాపం జగన్‌దే" అని చంద్రబాబు అన్నారు.

జగన్ రాయలసీమ ద్రోహి అంటూ చంద్ర‌బాబు విమ‌ర్శించారు. సీమ ప్రాజెక్టుల కు తీరని అన్యాయం చేశారని, సిగ్గనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కోసం దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరిగాయన్నారు. రాయలసీమ అభవృద్ధి ఎన్టీఆర్ తెచ్చిన తెలుగు గంగ ప్రాజెక్ట్‌ తోనే ప్రారంభమైందన్నారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం వల్ల రాష్ట్రానికి మేలు కలుగుతుందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల పై తెలుగుదేశం హయాం లో రూ.68,293 కోట్లు ఖర్చు పెడితే.. వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.22,165 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.

ఇవీ చంద్ర‌బాబు చెప్పిన లెక్క‌లు

రాయలసీమ లో ప్రాజెక్టుల కోసం టీడీపీ ప్ర‌భుత్వ హయాం లో రూ. 12,441 కోట్లు ఖర్చు చేశామని.. వైసీపీ హయాం లో రూ. 2011 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు.

తెలుగు గంగ కు టీడీపీ రూ. 504 కోట్లు ఖర్చు పెడితే.. వైసీపీ రూ.300 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని తెలిపారు.

హంద్రీ - నీవా ప్రాజెక్టు కోసం టీడీపీ రూ. 4 వేల కోట్లకు పైగా ఖర్చు పెడితే.. జగన్ రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు


గొల్లపల్లి ప్రాజెక్టు ను పూర్తి చేశామని. అందుకే కియా ప్రాజెక్టు వచ్చిందని తెలిపారు.

రాజకీయ కక్షతో కుప్పానికి నీరందించ లేదని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి కమీషన్లపైన ఉండే శ్రద్ధ రాయలసీమ ప్రాజెక్టుల మీద లేదన్నారు.