పాక్ దత్తపుత్రులను చంపిన బీ.ఎస్.ఎఫ్... వారిలో పెహల్గాం బ్యాచ్?
మరోవైపు ఇదే అదనుగా అన్నట్లుగా ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయనిస్తున్నారు. తాజాగా వారికి బిగ్ షాక్ తగిలింది.
By: Tupaki Desk | 9 May 2025 1:34 PM ISTభారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దులు అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అన్ని విషయాల్లోనూ పాక్ పై భారత సైన్యం పైచేయి సాధిస్తూనే ఉంది. ఓ పక్క పాక్ నుంచి వస్తున్న దాడులను సక్సెస్ ఫుల్ గా తిప్పికొడుతూనే మరోపక్క పాక్ గుండెలపై గుద్దే పనులు చేస్తుంది. ఈ సమయంలో పాక్ దత్తుపుత్రులు వారి ప్రయత్నాల్లో వారున్నారు!
అవును.. పాక్ ప్రయత్నాలకు చెక్ పెడుతూ, ఆ దేశంలోని కీలక నగరాలు, ప్రాంతాలు లక్ష్యంగా భారత్ దాడులు చేస్తున్న సమయంలో.. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. మరోవైపు ఇదే అదనుగా అన్నట్లుగా ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయనిస్తున్నారు. తాజాగా వారికి బిగ్ షాక్ తగిలింది.
అవును... ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకొంటున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని సాంబ జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. అయితే.. ఆ ప్రయత్నాలను బీ.ఎస్.ఎఫ్. తిప్పికొట్టింది. సరిగ్గా గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్లు బీ.ఎస్.ఎఫ్. ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఈ ఘటనలో కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు బీ.ఎస్.ఎఫ్. వర్గాలు వెల్లడించాయి. అయితే... పహల్గాం ఉగ్రదాడి అనంతరం అడవుల్లోకి పారిపోయినట్లు చెప్పబడుతున్న ఆ దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు... తాజాగా బీ.ఎస్.ఎఫ్. కాల్పుల్లో మరణించిన వారిలో ఎవరైనా ఉన్నారా అనే సందేహాలు తెరపైకి వచ్చాయి! అయితే.. దీనిపై బీ.ఎస్.ఎఫ్. నుంచి క్లారిటీ రావాల్సి ఉంది!