Begin typing your search above and press return to search.

గ్యాంగస్టర్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ దారుణ హత్య.. చంపింది అతడేనా?

2016 ఫిబ్రవరిలో ముంబైలో పోలీసులతో జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ప్రముఖ గ్యాంగస్టర్‌ సందీప్‌ గడోలీ హతమయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Jan 2024 6:58 AM GMT
గ్యాంగస్టర్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ దారుణ హత్య.. చంపింది అతడేనా?
X

2016 ఫిబ్రవరిలో ముంబైలో పోలీసులతో జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ప్రముఖ గ్యాంగస్టర్‌ సందీప్‌ గడోలీ హతమయిన సంగతి తెలిసిందే. తాజాగా అతడి గర్ల్‌ ఫ్రెండ్, గురుగ్రామ్‌ కు చెందిన మోడల్‌ దివ్య పహుజా హత్యకు గురైంది. ఆమెను ఎవరో దుండగులు కాల్చిచంపారు.

గురుగ్రామ్‌ కు చెందిన 27 ఏళ్ల దివ్య పహుజా మోడల్‌ గా పనిచేస్తోంది. గ్యాంగస్టర్‌ సందీప్‌ గడోలిని పోలీసులు ఎన్‌ కౌంటర్‌ చేయడంలో ప్రధాన పాత్ర దివ్యదేనని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఆమెను హనీ ట్రాప్‌ గా వాడుకుని అతడికి వల వేశారని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో దివ్య పహుజాను ఆమె బస చేసిన సిటీ పాయింట్‌ లో ఆ హోటల్‌ యజమాని అభిజీత్‌ సింగ్‌ హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యలో అభిజీత్‌ సింగ్‌ తన హోటల్‌ లో పనిచేసే హేమరాజ్, ఓం ప్రకాష్‌ సహాయం తీసుకున్నాడని చెబుతున్నారు. ఆమె మృతదేహాన్ని బయట పారవేయడానికి అభిజీత్‌ సింగ్‌ వారికి 10 లక్షల రూపాయలు ఇచ్చాడని సమాచారం

దివ్య హత్య నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు నీలి రంగు బీఎండబ్ల్యూ కారులో దివ్య మృతదేహాన్ని ఒక షీటులో పెట్టుకుని పారిపోతున్న దృశ్యాలు ఇందులో నిక్షిప్తమయ్యాయి. అభిజిత్, ఇతరులు దివ్య మృతదేహాన్ని ఒక షీట్‌ లో చుట్టి హోటల్‌ లోకి లాగడం సీసీ టీవీ పుటేజీల్లో ఉంది.

పోలీసుల విచారణలో అభిజీత్‌ పలు విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. తనకు సంబంధించిన పలు అభ్యంతరకర చిత్రాలు తన వద్ద ఉన్నాయంటూ భారీ ఎత్తున డబ్బు డిమాండ్‌ చేసిందని పోలీసులకు తెలిపాడు.

ఈ క్రమంలో జనవరి 2న రాత్రి ఆ చిత్రాలను ఆమె ఫోన్‌ నుంచి తొలగించాలని కోరానని వివరించాడు. అయితే ఆమె ఫోన్‌ పాస్‌ వర్డ్‌ ను చెప్పలేదని, అంతేకాకుండా ఆ చిత్రాలను తొలగించడానికి నిరాకరించిందని పేర్కొన్నాడు. దీంతో కోపంతో ఆమెను కాల్చిచంపానని తెలిపాడు.

మరోవైపు ఇది దివ్య బాయ్‌ ఫ్రెండ్, పోలీసుల చేతిలో ఎన్‌ కౌంటర్‌ అయిన సందీప్‌ గడోలి కుటుంబ సభ్యుల పనేనని దివ్య కుటుంబం ఆరోపిస్తోంది. వారే తమ కుమార్తెను చంపారని దివ్య తల్లిదండ్రులు చెబుతున్నారు.