Begin typing your search above and press return to search.

క్రిమినల్ కేసుల్లో బీయారెస్ ఎమ్మెల్యేలు టాప్!

119 ఎమ్మ్మెల్యేలలో 72 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని తేలింది. ఇందులో టాప్ లో అధికారంలో ఉన్న బీయారెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారని వెల్లడించడం విశేషం.

By:  Tupaki Desk   |   21 Oct 2023 3:14 PM GMT
క్రిమినల్ కేసుల్లో బీయారెస్ ఎమ్మెల్యేలు టాప్!
X

తెలంగాణాలో హోరాహోరీగా ఎన్నికలు సాగుతున్న నేపధ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారంస్ (ఏడీయార్) సంచలన విషయాలను బయట పెట్టింది. ప్రస్తుత అసెంబ్లీలో ఏ ఏమ్మెల్యే ఏంటి అన్న దాని మీద ఆ సంస్థ తన అధ్యయనాన్ని బయటపెట్టింది. సరిగ్గా ఎన్నికల ముంగిటలో బయటకు వచ్చిన ఈ అధ్యయనం అతి పెద్ద చర్చకు దారి తీస్తోంది

ఏడీయార్ అధ్యయనం ప్రకారం చూసుకుంటే తెలంగాణాలోని మొత్తం 119 ఎమ్మ్మెల్యేలలో 72 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని తేలింది. ఇందులో టాప్ లో అధికారంలో ఉన్న బీయారెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారని వెల్లడించడం విశేషం. ఇక ఈ 72 మందిలో కూడా ఏడుగురు ఎమ్మెల్యేల మీద హత్యా యత్నం కేసుకు ఉన్నాయని, మరో నలుగురు మీద మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని పేర్కొంది.

ఇంతే కాదు 46 మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటుంటున్నారు అని చెప్పడం గమనార్హం. ఇక చూసుకుంటే బీయారెస్ ఎమ్మెల్యేలలో 59 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. అదే విధంగా చూస్తే మజ్లీస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరుగురు మీద, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక తెలిపింది.

అంతే కాదు బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మీద తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉనాయని పేర్కొంది. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ వివరాలు బయటకు రావడం వల్ల రాజకీయ లొల్లి ఒక రేంజిలో ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. నేరపూరితమయమైన రాజకీయాలలో బీయారెస్ దే పై చేయి అని విపక్షాలు గొంతు చించుకునే చాన్స్ ఉంది అంటున్నారు. అయితే బీయారెస్ కూడా విపక్షాల క్రిమినల్ కేసులను ప్రస్తావించే సందర్భమూ ఉంటుంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే అధికార బీయారెస్ 2018లో గెలిచిన వారు తమ పార్టీలో చేరిన వారిలో నూటికి తొంబై శాతం మందికి తిరిగి టికెట్లు ఇచ్చింది. ఇపుడు ఇదే పెద్ద ఇష్యూ అవుతుంది అని అంటున్నారు. కాంగ్రెస్ తొలి విడత జాబితా మాత్రమే రిలీజ్ చేసింది. బీజేపీ అయితే ఆ పనిలో ఉంది.

దాంతో క్రిమినల్స్ 2018లో తమ పార్టీలో ఉంటే కనుక విపక్షాలు ఎంతో కొంత సర్దుకుని జాబితాలను ప్రకటించే వీలుంది అంటున్నారు. బీయారెస్ కి అలా కాదని అంటున్నారు. ఎందుకంటే వారిని అభ్యర్ధులుగా ప్రకటించి జనంలో ఉంచింది. దాంతో బీయారెస్ కి ఏడీయార్ నివేదిక ఇపుడు అతి పెద్ద ఇబ్బందిని కలుగచేసేలా ఉంది అని అంటున్నారు. అయితే కేసులు అందరి మీద ఉంటాయి తీర్పు రావాలి కదా అప్పటి దాకా అందరూ నిందితులే అన్న సహజ న్యాయ సూత్రాన్ని వల్లించి ఏ రాజకీయ పార్టీ అయినా గట్టెక్కడం కామన్. ఏది ఏమైనా ఏడీయార్ నివేదిక ఇపుడు తెలంగాణా రాజకీయాలకు కొత్త ఆయుధం ఇచ్చినట్లు అయింది అంటున్నారు.