Begin typing your search above and press return to search.

ప్ర‌చారం ప్ల‌స్సే.. కానీ, జేబులు గుల్ల‌వుతున్నాయే.. బీఆర్ఎస్ టాక్!

ఈ ఖ‌ర్చును భ‌రించ‌లేని ప‌రిస్థితిలో ఉన్నా.. కేసీఆర్ ప్ర‌చారంతో త‌మ‌కు మేలు జ‌రిగితే.. త‌ర్వాత ఎలాగోలో భ‌ర్తీ చేసుకోవ‌చ్చ‌న్న ధ్యాస‌తో అభ్య‌ర్థులు సాహ‌సాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

By:  Tupaki Desk   |   8 Nov 2023 10:30 AM GMT
ప్ర‌చారం ప్ల‌స్సే.. కానీ, జేబులు గుల్ల‌వుతున్నాయే.. బీఆర్ఎస్ టాక్!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ నేత‌లు ల‌బోదిబో మంటున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టికెట్లు రాలేద‌ని.. గ‌గ్గోలు పెట్టిన నాయ‌కులు.. ఇప్పుడు టికెట్ వ‌చ్చినా ముఖంలో సంతోషం క‌నిపించ‌డంలేదు. ఇది నిజ్జంగా నిజం! ఎందుకంటే.. పోరు ఆ రేంజ్‌లో ఉంది. ఒక‌వైపు స‌ర్వే సంస్థ‌లు ఏ పార్టీకీ మెజారిటీ క‌ట్ట‌బెట్ట‌డం లేదు. పోరు ఏక‌ప‌క్ష మ‌ని తేల్చ‌ల‌డం లేదు. ప్ర‌జ‌ల నాడి అటు ఇటుగా ఉంద‌ని తేల్చేస్తున్నా యి. దీంతో నాయ‌కుల్లో టెన్ష‌న్ పెరిగిపోతోంది.

క్ష‌ణం తీరిక‌లేకుండా.. చెమ‌టోడిస్తే త‌ప్ప‌.. గెలుపు గుర్రం ఎక్క‌డం క‌ష్ట‌మ‌ని బీఆర్ ఎస్ నాయ‌కులు భావిస్తున్నారు. దీనికితోడు స్టార్ క్యాంపెయిన‌ర్‌గా సీఎం కేసీఆర్ అన్ని బాధ్య‌త‌ల‌ను భుజాన వేసుకున్నారు. దీంతో ఆయ‌న రోజుకు రెండు మూడు జిల్లాలు... నాలుగైదు నియోజ‌క‌వ‌ర్గాలు ల‌క్ష్యంగా పెట్టుకుని సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఇది ఒక‌ర‌కంగా.. బీఆర్ ఎస్ టికెట్ తీసుకున్న‌వారికి నెత్తిన పాలు పోస్తోంది.

కేసీఆర్ వ్యాఖ్య‌లు, దూకుడు ప్ర‌సంగాలు వారికి మేలు చేస్తాయ‌ని భావిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య వారిని ముంచేస్తోంది. కేసీఆర్ స‌భ పెట్టారంటే.. హీన‌ప‌క్షం రెండు మూడు ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించాలి. భారీ గ్రౌండ్‌ను అద్దెకు తీసుకోవాలి. అక్క‌డ వంద‌ల వేల సంఖ్య‌లో బీఆర్ ఎస్ జెండాల‌ను ఏర్పాటు చేయాలి. మైకు నుంచి మంచినీళ్ల వ‌ర‌కు, కుర్చీల నుంచి వ‌చ్చిన వారికి ఏర్పాట్ల వ‌ర‌కు అన్నీ అభ్య‌ర్థులే ఏర్పాటు చేసుకోవాలి.

పార్టీ కొంత ఇస్తామ‌ని చెబుతున్నా.. అభ్య‌ర్థులకు ఏమాత్రం గిట్టుబాటు కాదు. ముఖ్యంగా ఒక్కొక్క స‌భ నిర్వ‌హ‌ణ‌కు కోటిన్న‌ర నుంచి 2 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెడుతున్నార‌ని స‌మాచారం. పైగా.. కేసీఆర్ వ‌స్తున్నా రంటే.. ముందుగానే రెండు కిలో మీట‌ర్ల దూరం నుంచి ప్ర‌చారం ప్రారంభించాలి. అదేస‌మ‌యంలో ప‌త్రిక‌ల‌కు, స్థానిక మీడియాకు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాలి. ఇదేమీ ఊరికేనే రావ‌డం లేదు.

ఇక‌, త‌మ‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే మీడియాను బ‌తిమాలుకునైనా నిరీక్షించేలా చేయాలి. ఇవ‌న్నీ కూడా అభ్య‌ర్థుల‌కు త‌ల‌కు మించిన భారంగా మారింద‌నే వాద‌న బీఆర్ ఎస్‌లో వినిపిస్తోంది. ఈ ఖ‌ర్చును భ‌రించ‌లేని ప‌రిస్థితిలో ఉన్నా.. కేసీఆర్ ప్ర‌చారంతో త‌మ‌కు మేలు జ‌రిగితే.. త‌ర్వాత ఎలాగోలో భ‌ర్తీ చేసుకోవ‌చ్చ‌న్న ధ్యాస‌తో అభ్య‌ర్థులు సాహ‌సాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.