Begin typing your search above and press return to search.

సందట్లో సడేమియా... పాక్ కు తేరుకోలేని దెబ్బకొట్టిన బలుచిస్తాన్!

పాక్ దాడులకు ప్రతీకారంగా కౌంటర్ ఎంటాక్స్ స్టార్ట్ చేసింది భారత్. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్, రావల్పిండిలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   9 May 2025 9:34 AM IST
సందట్లో సడేమియా... పాక్  కు తేరుకోలేని దెబ్బకొట్టిన బలుచిస్తాన్!
X

ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని సుమారు రెండు వారాలుగా అవిరామంగా ఉల్లంఘిస్తున్న పాక్.. ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) నుంచి భారత్ పైకి డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలు పంపే ప్రయత్నాలు చేసింది. భారత్ తిప్పి కొట్టింది.

పాక్ దాడులకు ప్రతీకారంగా కౌంటర్ ఎంటాక్స్ స్టార్ట్ చేసింది భారత్. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్, రావల్పిండిలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో... పాకిస్థాన్ సైన్యంపై విరుచుకుపడింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇందులో భాగంగా... బలుచిస్తాన్ నుంచి పాక్ ఆర్మీని తరిమికొట్టి.. క్వెట్టా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

అవును... మే 8 - 9 తేదీల మధ్య రాత్రి వేళ పలు భారతీయ నగరాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి ప్రయత్నించింది. అయితే ఆ దాడిని భారత్ తిప్పికొట్టింది. కౌంటర్ అటాక్స్ స్టార్ట్ చేసింది. ఈ గ్యాప్ లో బలూచిస్తాన్ లోని క్వెట్టాలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీ.ఎల్.ఏ) రంగంలోకి దిగింది. పాక్ సైన్యానికి షాకిచ్చింది!

ఈ సందర్భంగా... క్వెట్టాలోని పాకిస్థాన్ దళాల ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసిన తర్వాత ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో తాజా నివేదికల ప్రకారం.. బలూచీ తిరుగుబాటుదారులు క్వేట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. పాక్ సైన్యాన్ని బయటకు నెట్టేశారు!

కాగా.. పాకిస్థాన్ ప్రావిన్స్ బలుచిస్తాన్ రాజధాని క్వెట్టా అనే సంగతి తెలిసిందే. ఇది పాకిస్థాన్ లోనే తొమ్మిదో అతిపెద్ద నగరం. చుట్టూ పర్వతాలతో చుట్టుముట్టిన లోయలో ఉన్న ఈ ప్రాంతంలో అనేక పండ్ల తోటలు ఉంటాయి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉత్పత్తి కూడా ఎక్కువ కావడంతో.. ఈ నగరాన్ని "పాకిస్థాన్ పండ్ల తోట" అని కూడా పిలుస్తారు.