షాకింగ్ వీడియో... కళ్లల్లో కారంపొడి కొట్టి రూ.50,000 కొట్టేశాడు!
అనంతరం సెల్ ఫోన్ రీఛార్జ్ అడిగిన సదరు వ్యక్తి.. కళ్లు మూసి తెరిచే లోపు షాపు యజమాని కళ్లల్లో కారం జల్లి, కౌంటర్ లో డబ్బులు ఎత్తుకెళ్లిపోయాడు.
By: Tupaki Desk | 2 May 2025 12:30 PMఓ మొబైల్ షాప్ లోకి ఓ వ్యక్తి తలపై హుడీ ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని ఎంట్రీ ఇచ్చాడు. ఎండకు హుడీ, హెల్త్ కోసం మాస్క్ అని ఆ షాప్ యజమాని భావించి ఉండొచ్చు. అనంతరం సెల్ ఫోన్ రీఛార్జ్ అడిగిన సదరు వ్యక్తి.. కళ్లు మూసి తెరిచే లోపు షాపు యజమాని కళ్లల్లో కారం జల్లి, కౌంటర్ లో డబ్బులు ఎత్తుకెళ్లిపోయాడు.
అవును... సినిమా పక్కీలో జరిగినట్లుగా అనిపించిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఫోన్ రీఛార్జ్ కోసం అని షాపుకి వెళ్లిన వ్యక్తి ఉన్న పలంగా కారం పౌడర్ చల్లడం, దోపిడీ చేయడం, అక్కడ నుంచి పారిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో హల్ చల్ చేస్తుంది.
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లోని చాంద్ పూర్ లో గల అంబేద్కర్ చౌక్ లో సుహైల్ అనే వ్యక్తికి సంబంధించిన ఓ మొబైల్ దుకాణం ఉంది. ఈ సమయంలో ఓ వ్యక్తి కస్ట్ మర్ గా నటిస్తూ దుకాణంలోని ప్రవేశించాడు. అనంతరం.. మొదట రూ.19 మొబైల్ రీఛార్జ్ అడిగాడు, తర్వాత రూ.29కి మరో రీఛార్జ్ తీసుకున్నాడు.
ఈ సమయంలో డబ్బులు ఉంచే టెబుల్ సొరుగు తెరిచాడు షాపు వ్యక్తి సుహైల్. దీంతో.. తన జాకెట్ నుంచి కారంపోడిని తీసి సుహైల్ కళ్లల్లోకి విసిరాడు ఆ వ్యక్తి. ఆ గందరగోళంలో వెంటనే డబ్బులు పెట్టే సొరుగులో చెయ్యి పెట్టు సుమారు రూ.50,000 తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమయంలో సుహైల్ అతన్ని వెంబడించినా ఫలితం దక్కలేదు.
అనంతరం బిజ్ నోర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సోహైల్. దీనిపై స్పందించిన సర్కిల్ ఇనిస్పెక్టర్ భరత్ కుమార్... సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని, నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దర్యాప్తు వేగంగా జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.