Begin typing your search above and press return to search.

అవ‌నిగ‌డ్డలో 'చిన్న‌సార్' ర‌చ్చ‌.. ఏం జ‌రిగింది ..!

అయితే.. మండ‌లి మాత్రం ఈ ఆరోప‌ణ‌లను తోసిపుచ్చుతున్నారు. మేం నిప్పు అంటున్నారు.

By:  Tupaki Desk   |   11 May 2025 3:00 AM IST
అవ‌నిగ‌డ్డలో చిన్న‌సార్ ర‌చ్చ‌.. ఏం జ‌రిగింది ..!
X

ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని అవనిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ విజ‌యం ద‌క్కించుకున్నారు. టికెట్ తీసుకు నే వ‌ర‌కు కూడా ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు. అంతేకాదు.. త‌న‌కు టికెట్ ద‌క్క‌ద‌ని తెలిసిన త‌ర్వాత‌.. ఆయ‌న విమ‌ర్శ‌లు కూడా గుప్పించారు. ఈ క్ర‌మంలో రాత్రికి రాత్రి ఆయ‌న‌కు జ‌న‌సేన నుంచి పిలుపు రావ‌డం.. ఆయ‌న నేరుగా మంగ‌ళ‌గిరిలోని పార్టీ ఆఫీసుకు వెళ్లి జెండా క‌ప్పుకొని టికెట్ పుచ్చుకున్నారు.

ఇక‌, కూట‌మి దూకుడుతోపాటు.. గ‌త ఓట‌మి తాలూకు సానుభూతి కూడా తోడై.. మండ‌లి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌నకు బ‌దులుగా ఆయ‌న అల్లుడు, కుమారుడు కుమార్తె చ‌క్రం తిప్పుతున్నా ర‌న్న చ‌ర్చ కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఎన్న‌డూ లేనిది.. కుటుంబాన్ని ఎంట్రీ ఇప్పించ‌డం.. తాను త‌ప్పుకొని అధికారిక చ‌ర్య‌లన్నీ కుమారుడితో చేయించ‌డం వంటివి మండ‌లి స్ట‌యిల్‌ను మార్చేశాయి. వాస్త‌వానికి మండ‌లి కుటుంబానికి చాలా మంది పేరుంది.

మండ‌లి వెంక‌ట కృష్నారావు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అక్ర‌మాలు, అన్యాయాల‌కు ఎక్క‌డా చోటు లేని విధం గా ఈ ఫ్యామిలీ పేరు తెచ్చుకుంది. కానీ, త‌రం మారుతున్న కొద్దీ.. ప‌రిషస్థితులు.. ప‌రిణామాలు కూడా మారుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇసుక ఆరోప‌ణ‌లు పెరుగుతున్నాయి. ఇదేస‌మ‌యంలో టీడీపీ నాయ‌కు ల‌ను ఏమాత్రం జోక్యం చేసుకోకుండా.. కూడా చేస్తున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. స‌హ‌జంగా చాలా నియోజ కవ‌ర్గాల్లో జ‌న‌సేన‌-టీడీపీ క‌లిసిపోయి.. ప‌నిచేసుకుంటున్నారు.

కానీ, మండ‌లి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అవ‌నిగ‌డ్డ‌లో మాత్రం.. అన్నీ ఆయ‌న కుమారుడి క‌నుస‌న్న‌ల్లోనే సాగుతున్నాయ‌ట‌. దీంతో త‌మ్ముళ్లు ల‌బోదిబో మంటున్నారు. సీనియ‌ర్ నాయ‌కుల‌కు అధికారులు ఏమా త్రం ప్రాధాన్యం లేకుండా చేస్తున్నార‌ని.. అంతా 'చిన్న‌సార్' చెప్పిన‌ట్టే జ‌రుగుతోంద‌ని చెబుతున్నారు. అయితే.. మండ‌లి మాత్రం ఈ ఆరోప‌ణ‌లను తోసిపుచ్చుతున్నారు. మేం నిప్పు అంటున్నారు. కానీ, త‌మ్ముళ్లే చిన్న‌సారు చేస్తున్న ప‌నుల‌ను ఆధారాల‌తో స‌హా నిరూపిస్తున్నారు. దీంతో జ‌న‌సేన వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య నిప్పులు రాజుకుంటున్నాయి.