Begin typing your search above and press return to search.

వైరల్.. ఇలాంటివి ఆ రాజుగారికి మాత్రమే సాధ్యమండి!

ఆయన కేంద్ర మాజీ మంత్రి. పదవి పోయిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు? అనుకోవచ్చు. కానీ.. ఆయన మిగిలినవారి మాదిరి కాదు.

By:  Tupaki Desk   |   11 Jan 2024 4:58 AM GMT
వైరల్.. ఇలాంటివి ఆ రాజుగారికి మాత్రమే సాధ్యమండి!
X

ఆయన కేంద్ర మాజీ మంత్రి. పదవి పోయిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు? అనుకోవచ్చు. కానీ.. ఆయన మిగిలినవారి మాదిరి కాదు.ఆ మాటకు వస్తే ఆగర్భ శ్రీమంతుడు. సంపద ఉన్నప్పటికీ సామాన్యంగా బతికే అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. కీలక పదవుల్ని చేపట్టి కూడా.. సాదాసీదా జీవితాన్ని కోరుకునే ఆయన.. మాటల కంటే చేతల్లోనే ఎక్కువగా చూపిస్తుంటారు. రాజ వంశంలో పుట్టినప్పటికి సామాన్యుడిలా వ్యవహరించే ఆయన తీరును పార్టీలకు అతీతంగా పొగిడేస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఆయనకు చెందిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది.


హైదరాబాద్ రైల్వేస్టేషన్ లో సాదాసీదా ప్రయాణికుడి మాదిరి.. తన కుటుంబంతో ఆయన ఫ్లాట్ ఫాం మీద కూర్చున్న ఫోటోను సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయన నిరాడంబరత గురించి ప్రస్తావించారు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఈ తరహాలో ఉండే రాజకీయ నాయకుడు అరుదుగా ఉంటారు. అరుదైన వ్యక్తిత్వానికి.. నిలువెత్తు నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అశోక్ గజపతి రాజు తన తీరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చగా మారారు.

ఇంతకూ ఆయన రైల్వే స్టేషన్ కు ఎందుకు వెళ్లారు? ఎక్కడకు వెళుతున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. వ్యక్తిగత పని మీద సతీమణి సునీలా గజపతి రాజు.. ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి రైల్లో మహారాష్ట్రకు వెళుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో రైలు కోసం వెయిట్ చేస్తూ.. ప్లాట్ ఫాం మీద ఎదరుచూస్తూ కనిపించారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారి.. ఈ తరహా రాజకీయ నేతలు సమకాలీన భారతంలోనూ.. అందునా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంటారని మాత్రం చెప్పకతప్పదు. ఏమైనా రాజుగారు రాజుగారే!