Begin typing your search above and press return to search.

బ్రేకింగ్... ఏపీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే!

ఇందులో భాగంగా... కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబులను నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు ఇచ్చారు.

By:  Tupaki Desk   |   10 Aug 2023 2:48 PM GMT
బ్రేకింగ్... ఏపీ గవర్నర్  కోటా ఎమ్మెల్సీలు వీరే!
X

ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు నామినేటెడ్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ ఆమోదం తెలిపారు. ఏపీ శాసన మండలిలో గవర్నరు కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు శాసన మండలి సభ్యుల స్థానాలను భర్తీ చేస్తూ.. రాష్ట్ర ప్రధాన ఎన్నిక అధికారి ముకేష్ కుమార్ మీనా ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు.

అవును... ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో గవర్నరు కోటాలో ఇద్దరు శాసన మండలి సభ్యుల నియామకానికి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ అమోదం తెలిపారు. ఇందులో భాగంగా... కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబులను నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు ఇచ్చారు.

రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నామినేట్ చేసిన కర్రి పద్మశ్రీ, డా.కుంభా రవిబాబులను ఖాళీ అయిన మండలి స్థానాల్లో శాసన మండలి సభ్యులుగా నియమిస్తూ జి.ఓ.ఎం.ఎస్. నంబరు 87ను జారీ చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కుంభా రవిబాబు.. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన నేత కాగా... కాకినాడ సిటీకి చెందిన కర్రి పద్మశ్రీ.. బలిజ సామాజికవర్గానికి చెందినవారు. త్వరలో వీరిద్దరినీ శాసనమండలి ఛైర్మన్ తన ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

కాగా... గతంలో గవర్నరు కోటాలో శాసన మండలి సభ్యులుగా నియమించబడిన చాదిపిరాళ్ల శివనాథ రెడ్డి, ఎన్.ఎం.డి.ఫరూక్ పదవీ కాలం జులై 20వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆ ఖాళీ స్థానాల్లో నూతనంగా రవి, పద్మశ్రీ లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.