Begin typing your search above and press return to search.

ఏపీకి మ‌రో ప్రాజెక్టు: కేంద్రం మంత్రితో చంద్ర‌బాబు భేటీ..!

పెట్టుబ‌డులు ప్రాజెక్టుల‌పై దృష్టి పెట్టిన ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా మ‌రో ప్రాజెక్టును ఏపీలో నెల‌కొ ల్పేందుకు ప‌చ్చ జెండా ఊపారు.

By:  Tupaki Desk   |   13 May 2025 10:30 AM
AP to Get India First Global Shipbuilding Repair Hub
X

పెట్టుబ‌డులు ప్రాజెక్టుల‌పై దృష్టి పెట్టిన ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా మ‌రో ప్రాజెక్టును ఏపీలో నెల‌కొ ల్పేందుకు ప‌చ్చ జెండా ఊపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్ర‌పంచ స్థాయిలో నౌకా నిర్మాణం, నౌకా మ‌ర‌మ్మ‌తుల కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయ‌నున్నారు. సుమారు 2 వేల ఎక‌రాల్లో నిర్మించ‌నున్న ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా వేలాది మందికి ఉపాధి ల‌భించే అవ‌కాశం ఉంద‌ని స‌ర్కారు తెలిపింది. ఈ క్ర‌మంలో కేంద్ర బృందంతో చంద్ర‌బాబు తాజాగా భేటీ అయ్యారు.

ఈ భేటీలో కేంద్ర మంత్రి స‌ర్బానంద్ సోనోవాల్ స‌హా.. ప‌లువురు నౌకా రంగానికి చెందిన ప్ర‌ముఖులు ఉన్నారు. ఏపీలోని దుగ‌రాజ ప‌ట్నంలో ఉన్న తీర ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించింది. త‌ద్వారా నెల్లూరు, ప్ర‌కాశం స‌హా సీమ జిల్లాల్లోని వారికి ఉపాధి ల‌భిస్తుందని అంచ‌నా వేస్తున్నారు. ఈ తీర ప్రాంతంలో ఏర్పాట‌య్యే నౌకా మ‌ర‌మ్మ‌తుల కేంద్రం ద్వారా.. ప్ర‌పంచ స్థాయిలో నౌక‌ల‌ను ఇక్క‌డ మ‌ర‌మ్మ‌తు చేయ‌నున్నారు.

దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నిధుల‌ను కేంద్ర మే అందించ‌నుంది. రాష్ట్ర ప్ర‌భుత్వం కేవ‌లం భూమి ని మాత్ర‌మే ఇవ్వ‌నుంది. దీనిని ఏర్పాటు చేస్తే స‌హ‌క‌రిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప‌లుమార్లు కేంద్రానికి విన్న‌వించారు. ఈ క్ర‌మంలో కీల‌క ప్రాజెక్టు రాష్ట్రానికి వ‌స్తోంద‌ని కూట‌మి నాయ‌కులు తెలిపారు. అయితే.. దీనిపై విమ‌ర్శ‌లు ఉన్నాయి. నౌకా మ‌ర‌మ్మ‌తు కేంద్రం ఏర్పాటు చేయ‌డం ద్వారా కాలుష్యం పెరుగుతుంద‌ని.. అందుకే ఇత‌ర రాష్ట్రాలు ఏవీ ముందుకు రాలేద‌నిమేధావులు చెబుతున్నారు.

అయితే..కాలుష్యం ఏర్ప‌డే విష‌యం వాస్త‌వ‌మేన‌ని.. దానిని నిర్మూలించేందుకు కూడా కేంద్రం నిధులు ఇస్తుంద‌ని.. ఈ ప్రాజెక్టు ద్వారా ప్ర‌పంచ స్థాయిలో ఏపీ పేరు వినిపిస్తుంద‌ని స‌ర్కారు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికిప్పుడు ఈ ప్రాజెక్టును తీసుకురావ‌డం ద్వారా స్థానికంగా ఉన్న‌వారికి త‌క్ష‌ణ ఉపాధి దొరుకుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. దీనిని వ్య‌తిరేకించాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా పేర్కొంది.