Begin typing your search above and press return to search.

మ‌రింత కాక రేపుతున్న ఏపీ రాజ‌కీయాలు.. !

తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ .. మున్ముందు ప‌రిస్థితిని ఆవిష్క‌రించారు. ఆయ‌న పోలీసుల‌ను, అధికారుల‌నే కాకుండా.. టీడీపీ నాయ‌కుల‌ను కూడా టార్గెట్ చేసుకుని కామెంట్లు చేశారు.

By:  Tupaki Desk   |   9 May 2025 10:00 PM IST
మ‌రింత కాక రేపుతున్న ఏపీ రాజ‌కీయాలు.. !
X

ఏపీ రాజ‌కీయాలు ప‌రిశీలిస్తున్న‌వారు.. వీటిని చూసి ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అధికార కూట‌మి పార్టీ ల‌కు, ప్ర‌తిప‌క్ష వైసీపీకి మ‌ధ్య పెరుగుతున్న గ్యాప్‌.. ఆందోళ‌న క‌రంగా ఉంద‌ని చెబుతున్నారు. ఇది ఎవ‌రి కీ మంచిది కాద‌ని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి భ‌విష్య‌త్తును లేకుండా చేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. పార్టీల మ‌ధ్య స్ఫ‌ర్థ‌లు కామ‌నే అయినా.. అవి క‌క్ష పూరిత రాజ‌కీయాల‌కు దారి తీస్తే.. మున్ముందు ప్ర‌మాద‌క‌ర సంకేతాలు పెంచుతాయ‌ని అంటున్నాయి.

తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ .. మున్ముందు ప‌రిస్థితిని ఆవిష్క‌రించారు. ఆయ‌న పోలీసుల‌ను, అధికారుల‌నే కాకుండా.. టీడీపీ నాయ‌కుల‌ను కూడా టార్గెట్ చేసుకుని కామెంట్లు చేశారు. ఎక్క‌డున్నా వ‌దిలి పెట్టేది లేద‌న్నారు. రాజకీయాల‌కు దూరంగా ఉన్నామ‌ని చెప్పినా.. కాళ్లా వేళ్లా ప‌డినా కూడా కనిక‌రించేది లేద‌ని హెచ్చ‌రించారు. ఆయ‌న వ్యాఖ్య‌లు ఎవ‌రిని ఉద్దేశించిన‌వో అంద‌రికీ తెలిసిందే. ఈ ప్ర‌భావం రాష్ట్ర భవిష్య‌త్తుపై ప‌డుతుంద‌ని ప‌రిశీల‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

రాజ‌కీయాల్లో స‌హ‌జంగానే ఏ రాష్ట్రంలో అయినా.. రెండు వ‌ర్గాలు ఉంటాయ‌ని.. కానీ, క‌క్ష‌పూరిత చ‌ర్య‌ల‌కు దిగే విధంగా వ్య‌వ‌హ‌రిస్తే.. అది మంచిది కాద‌ని చెబుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం కూడా సంయ‌మ‌నం పాటించాల‌ని.. అవ‌కాశం వ‌చ్చింద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తే.. అది మున్ముందు పార్టీకి ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండ‌బోద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కుల‌ను అడ్డుకుంటున్న తీరు కూట‌మి పార్టీల‌ను హ్యాపీ చేస్తున్నాయి. రోజు కో కేసుతో కూట‌మి ప్ర‌భుత్వం వైసీపీని ముప్పుతిప్ప‌లు పెడుతోంది.

దీనికి అల‌వాటు ప‌డిన నాయ‌కులు స‌రే.. కానీ.. కొత్త నాయ‌కులు మాత్రం బెంబేలెత్తుతున్నారు. రాజకీయాల‌కు కూడా దూర‌మ‌వుతున్నారు. ఇది స‌హ‌జంగానే వైసీపీని ఇర‌కాటంలో ప‌డేసి.. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా విఘాతం క‌లిగిస్తోంది. కూట‌మి కోరుకునేది కూడా ఇదే. కానీ.. ప్ర‌జాతీర్పు ఎలా ఉంటుందో ఎవ‌రూ ఊహించ‌డం క‌ష్టం. ఒంట‌రిగానే ఉన్నా.. కూట‌మిగానే ఉన్నా.. ఓడిన గెలిచిన పార్టీలు అనేకం ఉన్నాయి. భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుంటే.. ఇప్పుడున్న దూకుడు పెంచ‌డం స‌రికాద‌న్న సూచ‌న‌లు దాదాపు అన్ని వ‌ర్గాల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇది రాష్ట్ర రాజ‌కీయాల‌ను భ‌విష్య‌త్తులో శాసించే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని చెబుతున్నారు.