Begin typing your search above and press return to search.

తల్లికి వందనం...ఈ లాజిక్ మిస్సాయ్యారా ?

తాము అధికారంలో ఉన్నపుడు అమ్మ ఒడి పధకాన్ని ఏకంగా 87 లక్షల దాకా తల్లుల ఖాతాలలో వేశామని చెబుతోంది.

By:  Tupaki Desk   |   14 Jun 2025 3:30 AM
తల్లికి వందనం...ఈ లాజిక్ మిస్సాయ్యారా ?
X

ఏపీలో తల్లికి వందనం పధకం ఎట్టకేలకు టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ఈ పధకం ఎన్నికల్లో చెప్పినట్లుగా తుచ తప్పకుండా అమలు చేస్తున్నారా అంటే అక్కడే చాలా విషయం ఉంది అని అంటున్నారు. వైసీపీ అయితే ఇందులో చాలా మిస్ అయ్యారని ముందే విమర్శలు చేస్తోంది.

తాము అధికారంలో ఉన్నపుడు అమ్మ ఒడి పధకాన్ని ఏకంగా 87 లక్షల దాకా తల్లుల ఖాతాలలో వేశామని చెబుతోంది. అదే కూటమి ప్రభుత్వం 67 లక్షలకు దానిని కుదించిందని దాని వల్ల ఏకంగా ఇరవై లక్షల మంది దాకా విద్యార్ధులు వారి తల్లులు నష్టపోతున్నారు అని విమర్శిస్తోంది. చాలా మందిని అనర్హులుగా చేస్తూ ఈ పధకం ఇవ్వడం వల్ల లాభమేంటని ప్రశ్నిస్తోంది.

సరే వైసీపీ వాదనలు విమర్శలు పక్కన పెడితే జగన్ హయాంలో 15 వేలు అని చెప్పి 13 వేల రూపాయలు ఇచ్చారని పెద్ద ఎత్తున విమర్శలు చేసిన కూటమి పార్టీలు ఇపుడు అదే పని చేయడం పట్ల జనాలలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పదిహేను వేలు కచ్చితంగా ఇస్తామని చెప్పి అందులో రెండు వేల రూపాయలు కట్ చేసారు. దానిని పాఠశాలల అభివృద్ధికి వెచ్చిస్తామని చెబుతున్నారు.

అయితే ఆ రెండు వేల రూపాయలను గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో స్కూల్ హెడ్మాస్టర్ అకౌంట్ లో వేసేవారు. దాంతో పేరంట్స్ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుని ఆ మొత్తాలను పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేసేవారు. ఇపుడు అలా కాకుండా కలెక్టర్ అకౌంట్ అంటే దానిని తెచ్చుకోవడమే కష్టం అవుతుందని వందల శాఖలు చూసే కలెక్టర్లకు ఇది అదనపు బాధ్యతగా ఉండి పాఠశాలల అభివృద్ధి మరింత జాప్యం అవుతుందని వాదన చేసేవారు ఉన్నారు.

ఇక పదమూడు వేల రూపాయలు విషయానికి వస్తే ఒక కుటుంబంలో ఒక్కరే బిడ్డ ఉన్న వారికి జగన్ నుంచి పదమూడు వేలు అందేవి. ఇపుడు చంద్రబాబు కూడా అదే ఇస్తున్నారు. తేడా ఏముంది అని అంటున్నారు. ఇద్దరు బిడ్డలు ఉన్న వారికి మాత్రం 26 వేల రూపాయలు వస్తాయి కాబట్టి వారు హ్యాపీగా ఫీల్ అవవచ్చు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ప్రతీ సచివాలయంలో కూడా అర్హుల జాబితా ఒకటి పెట్టారు. అది చూస్తే చిన్నగా తక్కువ మందితో ఉంటే అనర్హుల జాబితా పెద్దగా ఉంది. అందులో తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేకపోతున్నామని చెప్పేందుకు అనేక కారణాలు పక్కన ఉంచారు. కానీ ఆశగా సచివాలయాలకు వస్తున్న వారు కావాలనే తమను అనర్హులను చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తం మీద ఏతా వాతా తేలేది ఏంటి అంటే ఈ పధకం వల్ల కూటమి అనుకున్న నూరు శాతం ప్రయోజనాలు నెరవేరుతాయా అంటే కాదనే వినిపిస్తోంది. అదే సమయంలో ముందే చెప్పుకున్నట్లుగా అనర్హులు ఎటూ ఆగ్రహం మీద ఉంటారు ఇక ఒక బిడ్డ ఉన్న వారికి జగన్ అయినా బాబు అయినా ఒక్కటే. దాంతో పాటు ఇద్దరు బిడ్డలు ఉన్న వారు కూడా ముప్పయి వేలు రావాల్సిన చోట ఇరవై ఆరు వేలే వచ్చిందని చింతిస్తే ఇంకా సంతృప్తి స్థాయి తగ్గుతుంది అని అంటున్నారు

ఎందుకంటే జనాలకు ఒకటి చెప్పి ఒకటి ఇస్తే ఎపుడూ వారు సణుగుతూనే ఉంటారు పైగా పధకాలను అలవాటు చేశారు. సో కూటమికి తల్లికి వందనం పధకం లో ఎన్ని మార్కులు అంటే పూర్తిగా లబ్దిదారులందరికీ చేరేక అసలు రిపోర్టు వస్తుందని అంటున్నారు. చూడాలి మరి కూటమి ఈ పధకంతో ఆకట్టుకుందా లేదా అన్నది.