అమరావతి సభకు వచ్చే జనాలకు అదిరిపోయే ఆతిధ్యం
ఈ సభకు అమరావతి రాజధాని చుట్టు పక్కల జిల్లాలు అయిన గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావారి ప్రకాశం, ఎంటీఆర్, బాపట్ల, పల్నాడు, ఏలూరు జిల్లాల నుంచి జనాలను తీసుకుని రానున్నారు.
By: Tupaki Desk | 1 May 2025 4:25 PMఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులకు సంబంధించి శ్రీకారం చుడుతోంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీనే ఈ కార్యక్రమానికి పిలుస్తున్నారు అంటే జాతీయ స్థాయిలో అమరావతి రాజధాని మీద పెద్ద ఎత్తున చర్చ సాగాలనే అని అంటున్నారు.
ఇక అయిదారు లక్షలకు తక్కువ కాకుండా జనాలు ఈ సభకు హాజరవుతరని నిర్వాహకులు భావిస్తున్నారు. ఆ వచ్చే జనాల కోసం సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వారికి అదిరిపోయే రుచులతో కడుపు నింపనున్నారు. మరి ఆ ఆహార మెనూ ఏంటో ఒక్కసారి కనుక పరిశీలిస్తే చాలా విషయాలే ఉన్నాయి.
ఈ సభకు అమరావతి రాజధాని చుట్టు పక్కల జిల్లాలు అయిన గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావారి ప్రకాశం, ఎంటీఆర్, బాపట్ల, పల్నాడు, ఏలూరు జిల్లాల నుంచి జనాలను తీసుకుని రానున్నారు. మొత్తం ప్రభుత్వ ప్రైవేట్ బస్సులు కలిపి వందల కొద్దీ వీటిని వినియోగించనున్నారు. ఇలా బస్సులలో వచ్చే జనాలకు ఆ బస్సులలోనే ఆహార పొట్లాకు అందిస్తారు. అలాగే అరటి పండ్లు, వాటర్ బాటిల్స్, ఓఆర్ ఎస్ ప్యాకెట్స్, మజ్జిక ప్యాకెట్స్ ని ఇవ్వనున్నారు.
ఇక సభకు వచ్చిన తరువాత వారికి భోజనం కూడా ఏర్పాటు చేశారు. అంటే రాత్రికి అన్న మాట. కిచిడీ, చట్నీతో పాటు, ఒక ఆరెంజ్ పండుని ఇస్తారు. ఇలా వారి కోసం ప్రత్యేక శ్రద్ధ ఆహారం విషయంలో తీసుకుంటున్నారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను పౌర సరఫరాల శాఖ చూస్తోంది. లక్షలలో జనాలు వస్తే వారందరికీ రానూ పోనూ అల్పాహరం భోజనాలు వంటివి చూడడం అంటే గొప్ప విషయమే.
అంతే కాదు వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని ఎవరైనా అస్వస్థకు గురి అయితే వెంటనే వారికి వైద్య సేవలు అందేలా చూసేందుకు దగ్గరలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. అంతే కాదు ప్రతీ గాలరీలో ఆరుగురు వైద్య బృందం తో ఒక పర్యవేక్షణ ఉంటుంది.
మొత్తం మీద చూస్తే అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతున్న వేళ సభకు వచ్చే ప్రతీ వారినీ వీఐపీలుగా చూస్తూ వారికి మంచి మర్యాదలనే ప్రభుత్వం చేస్తోంది దాంతో ఈ సభకు రావడానికి ఎంతో మంది ఆసక్తిని చూపిస్తున్నారు. ఒక విధంగా ఆతీధ్యం విషయంలో ఈ సభకు సాటి మరోటి లేదు రాదు అన్నట్లుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.