Begin typing your search above and press return to search.

ఆ దేశ వాసుల కష్టాలు తీర్చేందుకే ఆ పని చేస్తున్నాడా?

దీంతో మళ్లీ అతడు బాటిళ్ల ద్వారా బియ్యం నింపి సముద్ర మార్గం ద్వారా వారికి పంపించడం మొదలుపెట్టాడు.

By:  Tupaki Desk   |   15 May 2024 4:30 PM GMT
ఆ దేశ వాసుల కష్టాలు తీర్చేందుకే ఆ పని చేస్తున్నాడా?
X

దక్షిణ కొరియాలో ఏర్పడిన కరువు పరిస్థితుల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆదుకోవాలని చూశాడు. దానికి వాటర్ బాటిళ్ల ద్వారా బియ్యం నింపి వారికి సముద్రం ద్వారా పంపించాడు. దీంతో వారి ఆకలిని తీర్చిన వాడయ్యాురు. కానీ దీన్ని దక్షిణ కొరియా ఆక్షేపించింది. కోర్టు ఆ దేశం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. దీంతో మళ్లీ అతడు బాటిళ్ల ద్వారా బియ్యం నింపి సముద్ర మార్గం ద్వారా వారికి పంపించడం మొదలుపెట్టాడు.

దక్షిణ కొరియాకు చెందిన సీయోమోడో ద్వీపంలో సముద్ర తీరంలో నిలబడిన పార్క్ జంగ్ ఓ బాటిల్ లో బియ్యం నింపి సముద్రంలో పడేశాడు. దీంతో అది అలల తాకిడికి ఉత్తర కొరియా చేరుతుంది. అక్కడ వారి ఆకలిని తీర్చేందుకు అతడు ఎంచుకున్న మార్గం ఇది. ఇలా అతడు తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. పార్క్ 26ఏళ్ల క్రితం ఉత్తర కొరియాను వదిలేసి దక్షిణ కొరియాకు వచ్చాడు.

ఉత్తర కొరియాలో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఎటు చూసినా చనిపోయిన వారే కనిపించేవారు. దీంతో చలించిన పార్క్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. వారికి ఆహారం అందించేందుకు బియ్యం నింపిన బాటిళ్లు పంపిస్తున్నాడు. ఇది నిరంతర ప్రక్రియగానే కొనసాగిస్తున్నాడు. రెండు వాటర్ బాటిళ్లలో కిలో బియ్యం పంపిస్తున్నాడు.

మొబైల్ ఫోన్లు, ఎలక్ర్టానిక్ పరికరాలు, కంప్యూటర్లు తదితర వస్తువులను కూడా పంపిస్తుంటాడు. కొన్ని సార్లు ప్రతి బాటిల్ లో ఒక అమెరికా డాలర్ ఉంచుతాడు. అది దొరికిన వారు చైనీస్ లేదా ఉత్తర కొరియా కరెన్సీలోకి మార్చుకుంటారు. కరోనా సమయంలో వాటర్ బాటిల్ లోపల పెయిన్ కిల్లర్ మందులు పంపించాడు. ఇలా పార్క్ తన మానవతను చాటుతున్నాడు.

పార్క్ ఇలా కొన్నేళ్లుగా చేస్తున్నాడు. తనకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ఆ దేశ ప్రజల కోసం తాను ఇలా చేస్తున్నానని చెబుతున్నాడు. వారి సంతోషమే కావాలని అంటున్నాడు. పార్క్ చేస్తున్న సేవలకు గుర్తింపు మాత్రం దక్కడం లేదు.