పెహల్గాం ఎఫెక్ట్.. ఈ దేశాలకు వెళ్లే విమాన టికెట్ల ధరలు పెరగనున్నాయ్
పాకిస్తాన్ ఉగ్రవాదులు పెహల్గాంలో చేసిన దాడిలో అమాయకులైన 28మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 2 May 2025 4:30 PMపాకిస్తాన్ ఉగ్రవాదులు పెహల్గాంలో చేసిన దాడిలో అమాయకులైన 28మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాని వల్ల ఇప్పుడు ఇరు దేశాల మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. ఇండియాకి, పాకిస్తాన్కి మధ్య అన్ని సంబంధాలు తెగిపోయాయి. అంతేకాదు, రెండు దేశాలు వాళ్ల గాల్లో వేరే దేశాల విమానాలు తిరగకుండా కూడా ఆపేశాయి. దీని వల్ల పాకిస్తాన్ ప్రయాణికులతో పాటు, మన ఇండియా నుంచి అమెరికా, ఇంగ్లాండ్, దుబాయి లాంటి దేశాలకు వెళ్లేవాళ్లకు కూడా చాలా ఇబ్బంది రాబోతోంది.
పాకిస్తాన్ సంగతి పక్కన పెడితే.. మన దేశం నుంచి ఉత్తర అమెరికా, ఇంగ్లాండ్, దుబాయి వెళ్లేవాళ్లకి టైమ్తో పాటు ఖర్చు కూడా బాగా పెరిగిపోనుంది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ల గగనతలం మూసేయడంతో, మన విమానాలు వేరే దారిలో వెళ్లాల్సి వస్తోంది. దాని వల్ల ముందు కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది. అందుకే ఎక్కువ టైమ్ పట్టడంతో పాటు, టికెట్ ధరలు కూడా త్వరలోనే పెరిగే ఛాన్స్ ఉంది.
మన దేశం నుంచి చాలామంది దుబాయి, ఉత్తర అమెరికా, బ్రిటన్కే వెళ్తుంటారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రోజూ ఈ దేశాలకి ఫ్లైట్స్ ఉంటాయి. దుబాయికి వెళ్లే ఎమిరేట్స్, ఇండిగో, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో 90 శాతం సీట్లు నిండుగానే ఉంటున్నాయి. మొన్నటిదాకా ఈ ఫ్లైట్లన్నీ పాకిస్తాన్ గాల్లోంచే వెళ్లేవి. కానీ పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ మన విమానాల్ని వాళ్ల గాల్లో తిరగనివ్వడం లేదు. అందుకే దుబాయి, అమెరికా, బ్రిటన్ వెళ్లే విమానాలన్నీ వేరే దారిలో వెళ్తున్నాయి. దాని వల్ల ప్రయాణ సమయం బాగా పెరిగిపోయింది. దూరం ఎక్కువ అవ్వడం, టైమ్ ఎక్కువ పట్టడం వల్ల విమాన కంపెనీల మీద ఎక్కువ భారం పడుతోంది.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విమాన కంపెనీలు ఈ భారాన్ని మోయగలవు కానీ.. ఎప్పటికీ ఇలాగే ఉంటే వాళ్లకి కష్టం కదా. అందుకే భవిష్యత్తులో పెరిగిన దూరం, టైమ్, దాని వల్ల పెరిగిన పెట్రోల్ ఖర్చులన్నీ విమాన కంపెనీలు ప్రయాణికుల మీదే వేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలా జరిగితే.. టైమ్ ఎక్కువ పట్టడంతో పాటు టికెట్ ధరలు కూడా పెరిగితే.. మన ప్రయాణికులకి దెబ్బ మీద దెబ్బ పడ్డట్టే. అయితే ఈ విషయంపై మొన్ననే మన పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఈ సమస్యని ఎలా దాటాలి అని మాట్లాడుతున్నామని చెప్పారు. ఇప్పుప్పుడే ప్రయాణికుల మీద భారం వేసే ఆలోచన లేదని కూడా ఆయన అన్నారు. కానీ ప్రైవేట్ విమాన కంపెనీలు ఈ భారాన్ని ఎంతకాలం మోస్తాయో చూడాలి.
మన దేశ లెక్కల ప్రకారం.. ఉత్తర అమెరికా, బ్రిటన్, దుబాయి లాంటి దేశాలకి మన దేశం నుంచి వెళ్లే విమానాలు పాకిస్తాన్ గాల్లోంచి కాకుండా వేరే దారిలో వెళ్లడం వల్ల వారానికి దాదాపు 77 కోట్ల రూపాయల అదనపు ఖర్చు అవుతుందట. ఈ లెక్కన నెలకు ఈ ఖర్చు 306 కోట్లకు చేరే ప్రమాదం ఉంది. ఇది కేవలం ఉత్తర భారత్ నుంచి వెళ్లే విమానాల వరకే. ఇక దక్షిణాది నుంచి వెళ్లే విమానాల ఖర్చులు కూడా కలిపితే.. ఈ మొత్తం ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. అదే టైమ్లో ప్రయాణికుల మీద పడే భారం కూడా భారీగానే ఉండే ఛాన్స్ ఉంది. మరి ఈ అదనపు ఖర్చుల్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.