Begin typing your search above and press return to search.

బాబు కోసం హీరోయిన్ పూజలు... బాలయ్య సినిమాపై ప్రశంసలు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Oct 2023 5:14 AM GMT
బాబు కోసం హీరోయిన్ పూజలు... బాలయ్య సినిమాపై ప్రశంసలు!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయలో బాబు విడుదల కావాలని టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే సమయంలో వరుసగా మూడు వారాంతపు కార్యక్రమాలకు పార్టీ పిలుపునిచ్చిన సంగతీ తెలిసిందే. ఇందులో భాగంగా మోతమోగిద్దాం, కాంతి క్రాంతి, న్యాయానికి సంకెళ్లు వంటి కార్యక్రమాలు జరిపారు.

ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ పై సినిమా ఇండస్ట్రీ జనాలు ఆశించిన స్థాయిలో స్పందించలేదనే కామెంట్లూ వినిపించాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి వేళ్లపై లెక్కగట్టే అంతమంది మాత్రమే చంద్రబాబు అరెస్ట్ పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది సైరైన చర్య కాదని ఆ అరెస్టును, అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండించారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ పూనం కౌర్ కూడా స్పందించారు!

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని హీరోయిన్ పూనం కౌర్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూజలు చేశారని తెలుస్తుంది. తన పుట్టినరోజు సందర్భంగా విజయవాడ “కనకదుర్గమ్మ”ను దర్శనం చేసుకోవటం నా అదృష్టంగా బావిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

అవును... విజయవాడ ఇంద్రకీలాద్రిపై లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శనివారం పూనం కౌర్ దర్శించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... పెద్ద వయసులో చంద్రబాబు జైల్లో ఉండటం ప్రపంచ వ్యాప్తంగా కలచి వేసిందని చెప్పుకొచ్చారు. అనంతరం... చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఈ సందర్బంగా తెలిపారు.

అంతకముందు “భగవంత్ కేసరి” సినిమా చూసినట్లు పూనం కౌర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇందులో భాగంగా... "భగవంత్ కేసరి చూసినందుకు చాలా రిఫ్రెషింగ్‌ గా ఉంది. ఈ సినిమా చూశాక నేను కూడా జై బాలయ్య బ్యాచ్‌ లో చేరాలనుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన వారంతా.. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అనంతరం ఆమె విజయవాడ లో కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్న విషయాన్ని ఆన్ లైన్ వేదిక్గా వెల్లడించారు.

ఇందులో భాగంగా... "మా కాళరాత్రిని పూజించేరోజున సౌమ్య రుద్ర రూపిణిగా కొలువైన విజయవాడ "కనకదుర్గమ్మ"ను నా పుట్టినరోజున దర్శనం చేసుకోవటం నా అదృష్టంగా బావిస్తున్నాను. నిత్య జీవితంలో మహిళలు దుర్గమ్మ స్పూర్తితో ధృడసంకల్పంతో జీవించాలని కోరుకుంటున్నా" అంటూ హీరోయిన్ పూనం కౌర్ ట్విట్ చేశారు.