Begin typing your search above and press return to search.

భార్య పిల్లల్ని చంపి సూసైడ్ చేసుకున్న కలెక్టర్ గన్ మ్యాన్

సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా విస్తుపోతున్నారు.

By:  Tupaki Desk   |   15 Dec 2023 9:25 AM GMT
భార్య పిల్లల్ని చంపి సూసైడ్ చేసుకున్న కలెక్టర్ గన్ మ్యాన్
X

షాకింగ్ ఉదంతం సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ కు గన్ మేన్ గా వ్యవహరించే వ్యక్తి.. భార్య పిల్లల్ని చంపేసి తనను తాను చంపేసుకున్న వైనం సంచలనంగా మారింది. సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా విస్తుపోతున్నారు. అసలేం జరిగిందంటే..

సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద గన్ మెన్ గా పని చేస్తున్నాడు నరేశ్. ఇతడు సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన వాడు. ఆయనకు భార్య చైతన్య.. కొడుకు, కుమార్తె ఉన్నారు. ఈ రోజు (శుక్రవారం) అతను విధులకు హాజరు కాలేదు. ఇంట్లోనే ఉన్నాడు.

అనూహ్యంగా భార్య.. పిల్లలు ఇద్దరిని చంపేసిన నరేశ్.. తనను తాను గన్ తో పేల్చుకొని చనిపోయాడు. పిస్టల్ శబ్ధంతో చుట్టుపక్కల వారు విని పరిగెత్తుకుంటూ రాగా.. రక్తపు మడుగులో నరేశ్ పడి ఉన్నాడు. ఇంట్లో భార్య.. ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో.. సమాచారాన్ని పోలీసులకు అందించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆర్థిక సమస్యలా? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పోలీసుల విచారణలోమిగిలిన విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. ఈ ఉదంతంస్థానికంగా పెను సంచలనంగా మారింది. ఊరి వారంతా విషాదంలో మునిగిపోయారు.