Begin typing your search above and press return to search.

ఫోన్ వాల్యూమ్ తగ్గించమంటే.. భార్యపై యసిడ్ పోసిన భర్త!

ఇటీవల కాలంలో భార్యభర్తల మధ్య జరుగుతున్న క్రైమ్ సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 May 2025 3:15 AM
ఫోన్ వాల్యూమ్ తగ్గించమంటే.. భార్యపై యసిడ్  పోసిన  భర్త!
X

ఇటీవల కాలంలో భార్యభర్తల మధ్య జరుగుతున్న క్రైమ్ సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల భార్యాభర్తల మధ్య జరిగిన ఎన్నో హత్యలు, ఆత్మహత్యల ఘటనలు తీవ్ర సంచలనంగా మారాయి. ఈ సమయంలో మొబైల్ ఫోన్ వాల్యూమ్ విషయంలో జరిగిన వాగ్వాదం కాస్తా యాసిడ్ దాడి వరకూ వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అవును... భార్యాభర్తల మధ్య జరిగిన క్రైమ్ సంఘటనల్లో తాజాగా మరో ఘోరం వచ్చి చేరింది! ఇందులో భాగంగా.. తన మొబైల్ ఫోన్ లో మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించే విషయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తన భార్యపై అతడు టాయిలెట్ క్లీనర్ యాసిడ్ పోశాడని పోలీసులు తెలిపారు! మే 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర బెంగళూరులోని సిదేదహళ్లిలోని ఎన్.ఎంహెచ్. లే అవుట్ లో ఓ దంపతులు కాపురం ఉంటున్నారు. ఈ సమయంలో.. వృత్తిరీత్యా బ్యూటీషియన్ అయిన భార్యను రాత్రి 9 గంటల సమయంలో ఆమె భర్త మద్యం కొనడానికి డబ్బులు అడిగాడు! అయితే.. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో.. వేదించడం మొదలుపెట్టాడు!

చివరికి డబ్బులు సంపాదించినన అతడు.. వెళ్లి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం మొబైల్ ఫోన్ లో ఎక్కువ వాల్యూమ్ తో పాటలు ప్లే చేయడం ప్రారంభించాడు. అప్పుడు.. వాల్యూమ్ తగ్గించమని ఆమె కోరగా.. అందుకు నిరాకరించాడు. అనంతరం ఇద్దరి మధ్యా వాగ్వాదం జరగడంతో.. బాత్రూంలో ఉన్న యాసిడ్ క్లీనర్ తెచ్చి ఆమె ముఖంపై పోశాడు!

వెంటనే ఆమె సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో అక్కడ నుంచి ఆమె భర్త పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో ఇరుగుపొరుగువారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె భర్త కోసం గాలిస్తున్నారు!