Begin typing your search above and press return to search.

'యాత్ర 2'.. జగన్, పవన్ ఫ్యాన్స్ మధ్య మళ్ళీ కొట్లాట

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్ర పోషించగా.. కోలీవుడ్ హీరో జీవా వైయస్ జగన్ పాత్రలో కనిపించనున్నారు

By:  Tupaki Desk   |   8 Feb 2024 1:22 PM GMT
యాత్ర 2.. జగన్, పవన్ ఫ్యాన్స్ మధ్య మళ్ళీ కొట్లాట
X

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాకి సీక్వెల్ గా 'యాత్ర 2' మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వైయస్సార్ తో పాటు ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని చూపించబోతున్నారు. 2009 నుంచి 2019 వర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్ర పోషించగా.. కోలీవుడ్ హీరో జీవా వైయస్ జగన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో మంచి హై క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఈరోజు (ఫిబ్రవరి 8) ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే 'యాత్ర 2' మూవీ ప్రదర్శితమవుతున్న థియేటర్లో వైయస్ జగన్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఈ ఘటన చోటు చేసుకోవడం సర్వత్ర చర్చనీయాంశమైంది. ప్రసాద్ ఐమాక్స్ లో 'యాత్ర 2' స్క్రీనింగ్ సమయంలో వైయస్ జగన్ - పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సంఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. థియేటర్లోనే ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు.

ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ చొక్కాలు చించుకునే స్థాయికి వెళ్లారు. ఆ సమయంలో సినిమా చూస్తున్న ఆడియన్స్ ఇబ్బందికి గురయ్యారు. అయితే అసలు గొడవ ఎందుకు జరిగిందనే విషయంపై క్లారిటీ లేదు. కానీ జగన్ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ అసలు వీళ్ళ మధ్య గొడవ ఎందుకు జరిగిందనే అంశంపై సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు. మామూలుగా ఏపీలో ఉన్న ఏరియాస్ లో ఇలా థియేటర్లో జగన్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ గొడవ పడడం కామనే. కానీ హైదరాబాదులో అదికూడా ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.