బాకీని సెటిల్ చేయనున్న యష్ రాజ్ ఫిల్మ్స్
మూడు సినిమాలను వరుసగా రిలీజ్ చేసి బాక్సాఫీస్ హీటును పెంచాలని చూస్తున్న యష్ రాజ్ ఫిల్మ్స్ వాటిలో ముందుగా వార్2 ను రిలీజ్ చేస్తుందని అంతా అనుకున్నారు.
By: Tupaki Desk | 8 May 2025 8:30 AMబాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి గతేడాది అంటే 2024లో ఏ సినిమా రిలీజ్ కాలేదు. అంత భారీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ ఎంతో నిరాశ పడ్డారు. అయితే గతేడాది బాకీని కూడా యష్ రాజ్ ఫిల్మ్ ఈ ఏడాది తీర్చడానికి రెడీ అయింది. అందులో భాగంగానే ఈ ఇయర్ సెకండాఫ్ లో ఏకంగా మూడు సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు.
మూడు సినిమాలను వరుసగా రిలీజ్ చేసి బాక్సాఫీస్ హీటును పెంచాలని చూస్తున్న యష్ రాజ్ ఫిల్మ్స్ వాటిలో ముందుగా వార్2 ను రిలీజ్ చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది. ఈ బ్యానర్ నుంచి వార్2 కంటే ముందు ఓ మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ ను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఆషికి2 ఫేమ్ మోహిత్ సూరి దర్శకత్వంలో అహాన్ పాండే, అనీత్ పద్దా ప్రధాన పాత్రల్లో నటించిన సయారా సినిమాను వార్2 కంటే ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యష్ రాజ్ సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా తర్వాత హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్2 సినిమా రిలీజ్ కానుంది.
ఆ తర్వాత ఆలియా భట్, శార్వరి నటించిన ఆల్ఫా రానుంది. స్పై యాక్షన్ ఫిల్మ్ గా ఆల్ఫా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలన్నింటిలో వార్2 సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడని తెలిసినప్పటి నుంచి వార్2 పై ఉన్న అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే వార్2 షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాపై అటు హృతిక్, ఇటు ఎన్టీఆర్, వారి ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.