Begin typing your search above and press return to search.

దేశానికి ప్ర‌ధాని అవుతారా? ఇదీ న‌టి జ‌వాబు!

ఫిబ్రవరి 2023లో రాజ‌కీయారంగేట్రంపై ప్ర‌శ్నించ‌గా, కంగనా రనౌత్ తాను రాజకీయాల‌కు స‌రిప‌డే వ్యక్తిని కాదని, రాజకీయ భావజాలం ఉన్న వ్యక్తిని మాత్ర‌మేన‌ని పేర్కొంది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 3:04 PM GMT
దేశానికి ప్ర‌ధాని అవుతారా? ఇదీ న‌టి జ‌వాబు!
X

వివాదాల క్వీన్ కంగనా రనౌత్ న‌టించిన తాజా చిత్రం `ఎమర్జెన్సీ` విడుద‌ల‌కు సిద్ధమవుతోంది. పొలిటికల్ డ్రామాలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి కంగనా రనౌత్ స్వయంగా దర్శకత్వం వహించారు. కంగ‌న ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు. ఇటీవల తెలుగు సినిమా `రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్` ట్రైలర్ లాంచ్‌లో దేశానికి ప్రధాని కావాలని ఎప్పుడైనా అనుకున్నారా? అని కంగ‌న‌ను అడిగారు. కంగనా నవ్వుతూ హిందీలో మాట్లాడుతూ.. ``నేను ఎమర్జెన్సీ అనే సినిమా చేశాను.. ఆ సినిమా చూశాక నన్ను ప్రధాని కావాల‌ని ఎవరూ కోరుకోరు`` అని వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లోకి వ‌స్తున్నారా? అంటూ కంగ‌న‌ను ప్రశ్నించడం ఇదే తొలిసారి కాదు. ఫిబ్రవరి 2023లో రాజ‌కీయారంగేట్రంపై ప్ర‌శ్నించ‌గా, కంగనా రనౌత్ తాను రాజకీయాల‌కు స‌రిప‌డే వ్యక్తిని కాదని, రాజకీయ భావజాలం ఉన్న వ్యక్తిని మాత్ర‌మేన‌ని పేర్కొంది. ట్విట్టర్‌లో టీవీ నటి ఉర్ఫీ జావేద్ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా ``నేను రాజకీయాల‌కు స‌రిప‌డే వ్యక్తిని కాదు.. సున్నితమైన వ్యక్తిని. రాజకీయాల్లోకి రావాలని నన్ను చాలాసార్లు అడిగారు.. నేను రాలేదు`` అని రాసింది.

అయితే రాజ‌కీయాల‌పై కంగ‌న మాట‌ల‌కు ఎప్పుడూ పొంత‌న లేదు. ఒక్కోసారి ఒక్కో స్టేట్ మెంట్ తో అంద‌రినీ క‌న్ఫ్యూజ్ చేస్తోంది. నవంబర్ 2023లో కంగనా రనౌత్ తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. శ్రీ కృష్ణ కీ కృపా రాహి టు లాడేంగే (శ్రీకృష్ణుడు ఆశీర్వధిస్తే నేను యుద్ధం చేస్తాను) అని వ్యాఖ్యానించింది. అయితే మరుసటి నెలలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వచ్చిన వార్తలను కంగ‌న నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

అలాగే కొన్ని రోజుల క్రితం ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ .. త‌న‌ను కెరీర్ ప‌రంగా తొక్కేందుకు కుట్ర చేసార‌ని కెరీర్ నే మార్చుకోవాల్సి ఉంద‌ని అన్నారు. పెయిడ్ ఆర్టిక‌ల్స్ తో ఇబ్బంది పెడుతున్నార‌ని కూడా కంగ‌న వ్యాఖ్యానించారు. త‌న‌పై కుట్ర చేసేవారిని తాను ఎదుర్కొంటాన‌ని కూడా కంగ‌న అన్నారు. అయితే ప్రేక్ష‌కులు చెత్త సినిమాల‌ను ఆద‌రించ‌డం క‌ల‌వ‌ర‌ప‌రిచింద‌ని కూడా కంగ‌న వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

ఎమర్జెన్సీ చిత్రంలో కంగనా రనౌత్‌తో పాటు అనుపమ్ ఖేర్, సతీష్ కౌశిక్ , మిలింద్ సోమన్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. తదుప‌రి తనూ వెడ్స్ మను సహనటుడు ఆర్. మాధవన్‌తో కూడా ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ప్రాజెక్ట్ కోసం తిరిగి కలుస్తుంది. ఆమెకు విజయ్ సేతుపతితో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ లో న‌టిస్తోంది. అలాగే నోటి బినోదిని అనే సినిమా కూడా చేస్తోంది.