Begin typing your search above and press return to search.

'విశ్వంభర'.. క్రేజీ అప్డేట్ ఏంటంటే?

సుమారు 14 రోజుల పాటు నిరంతర షెడ్యూల్ ఉండబోతోంది. ఈ షెడ్యూల్ ని హైదరాబాదులోని ఓ ప్రత్యేక స్టూడియోలో ప్లాన్ చేశారు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 2:55 PM GMT
విశ్వంభర.. క్రేజీ అప్డేట్ ఏంటంటే?
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందనున్న ఈ సినిమా ఇటీవల ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ ఆ షెడ్యూల్లో చిరంజీవి పాల్గొనలేదు. ఇక ఇప్పుడు 'విశ్వంభర' సెట్స్ లో అడుగుపెట్టేందుకు మెగాస్టార్ రెడీ అయ్యారు. రేపటి నుంచి విశ్వంభర సెట్స్ లోకి అడుగుపెడుతున్నారు.

సుమారు 14 రోజుల పాటు నిరంతర షెడ్యూల్ ఉండబోతోంది. ఈ షెడ్యూల్ ని హైదరాబాదులోని ఓ ప్రత్యేక స్టూడియోలో ప్లాన్ చేశారు. ఇక తాజా సమాచారం ఏంటంటే.. ఇదే షెడ్యూల్లో హీరోయిన్ త్రిష కూడా జాయిన్ కాబోతోందట. నిజానికి ఈ ప్రాజెక్టు కోసం ముందు అనుష్కను అనుకున్నారు. కానీ చివరికి ఆమె స్థానంలో త్రిషను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ప్రజెంట్ కోలీవుడ్ లో త్రిష బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉంది. దానికి తోడు ఇప్పుడు సౌత్ లో ఫుల్ డిమాండ్ ఉన్న సీనియర్ హీరోయిన్ కూడా కావడంతో మేకర్స్ ఈమెనే కథానాయికగా ఎంచుకున్నారు. మరో వారం తర్వాత త్రిష షూటింగ్లో పాల్గొననున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, త్రిష ఇద్దరిపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి, త్రిష కాంబినేషన్లో 'స్టాలిన్' సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అలాగే సినిమాలో చిరంజీవి - త్రిష మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత వీళ్ళిద్దరి కాంబో సెట్ అవ్వడం విశేషం. త్రిష విశ్వంభర సెట్స్ లో అడుగుపెట్టే సమయంలోనే హీరోయిన్ విషయమై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

కాగా 'విశ్వంభర' షూటింగ్ కోసం మెగాస్టార్ జిమ్ లో కసరతులు చేస్తున్న వర్కౌట్ వీడియోని తాజాగా తన ట్విట్టర్ వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే. జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో చిరంజీవి హెవీ వర్కౌట్స్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏజ్ లో కూడా చిరు ఇంతలా కష్టపడుతుడడం చూసి మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. UV క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.