Begin typing your search above and press return to search.

ఐదుగురు కావలెను.. 'విశ్వంభర' కి వింత సమస్య

ఈ సినిమాలో హిట్లర్ సినిమాలో కనుక ఉన్నట్లు ఐదుగురు చెల్లెలు ఉంటారట. ఆ అయిదుగురు చెల్లెల్లకు కూడా జోడీ కావాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   3 March 2024 1:48 PM GMT
ఐదుగురు కావలెను.. విశ్వంభర కి వింత సమస్య
X

ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాలకు స్టార్‌ కాస్ట్‌ ఎంపిక పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా హీరోలకు జోడీ హీరోయిన్‌ కోసం చాలా వెతకాల్సి వస్తుంది. కొత్త వారిని తీసుకుంటే వయసు మరీ తేడా అవుతుంది.. సీనియర్ హీరోయిన్స్ ను తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. హీరోయిన్స్ విషయంలో ఏదోలా మేనేజ్ చేస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమాకు ఓ వింత సమస్య వచ్చింది. ఈ సినిమాలో హిట్లర్ సినిమాలో కనుక ఉన్నట్లు ఐదుగురు చెల్లెలు ఉంటారట. ఆ అయిదుగురు చెల్లెల్లకు కూడా జోడీ కావాల్సి ఉంటుంది. కథానుసారం వారికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. కనుక కాస్త ఫేమస్ వారినే ఎంపిక చేయాల్సి ఉంటుంది.

చిరంజీవి సినిమా కనుక ఎవరిని పడితే వారిని తీసుకోవడానికి లేదు. అలా అని స్టార్స్ ని సంప్రదించే పరిస్థితి లేదు. దాంతో ఆ అయిదుగురు బావల కోసం వశిష్ట అండ్ టీం మొత్తం కూడా అన్వేషిస్తున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే తెలుగు వారు లేదా తెలుగేతరులను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెల్లు పాత్రల్లో ఈషా చావ్లా, సురభి, ఆషిక రంగనాథ్‌ లు కనిపించబోతున్నారు. ఇంకా మీనాక్షి చౌదరి మరియు మృణాల్‌ ఠాకూర్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తున్న విషయం తెల్సిందే.

భారీ స్టార్‌ కాస్ట్‌ తో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు 2025 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

చిరంజీవి చాలా కాలం తర్వాత చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా అవ్వడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు అందరిలో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు చిరంజీవి దాదాపు రూ.100 కోట్ల పారితోషికం అందుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.