Begin typing your search above and press return to search.

గొడవ తరువాత డైరెక్షన్ లోకి సీనియర్ హీరో

తమిళ్ లో కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విశాల్.

By:  Tupaki Desk   |   18 March 2024 4:59 AM GMT
గొడవ తరువాత డైరెక్షన్ లోకి సీనియర్ హీరో
X

తమిళ్ లో కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విశాల్. గత ఏడాది మార్క్ ఆంటోనీ సినిమాతో విశాల్ సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రత్నం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అయ్యాడు. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


ఇదిలా ఉంటే విశాల్ తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చాడు. తుప్పరివాళన్ 2 సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. తెలుగులో డిటెక్టివ్ టైటిల్ తో వచ్చిన తుప్పరివాళన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ యాక్షన్ మూవీ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది. మూవీలో విశాల్ డిటెక్టివ్ రోల్ లో నటించి మెప్పించాడు.

ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. మిస్కిన్ దర్శకత్వంలోనే ముందుగా చేయాలని అనుకున్న కూడా క్రియేటివ్ డిఫరెన్స్ వలన సెట్ కాలేదు. డైరెక్టర్ హీరోకు మధ్యలో మనస్పర్థలు కూడా వచ్చాయని ఆ మధ్య తమిళ మీడియాలో చాలా రకాల వార్తలు వచ్చాయి. ఇక మళ్ళీ మధ్యలో కొందరు టెక్నీషియన్స్ వారి మధ్యలో సంధి ఏర్పరచాలని ప్రయత్నం చేసినా సెట్ కాలేదు.

దీంతో కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు తుప్పరివాళన్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని విశాల్ అధికారికంగా ధృవీకరించాడు. మూవీతో దర్శకత్వం చేయాలనే తన కల నెరవేరబోతోందని కూడా చెప్పుకొచ్చాడు. విశాల్ డైరెక్టర్ గా గతంలోనే ఒక సినిమా చేస్తానని అన్నాడు. అయితే ఇప్పుడు సడన్ గా ఈ క్రేజీ సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకు వెళుతున్నాడు.

దీనిని బట్టి ఈ మూవీతో విశాల్ పూర్తిస్థాయి దర్శకుడిగా తనని తాను నిరూపించుకోవడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమానే విశాల్ నిర్మించనున్నాడు. అంటే నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా మూడు బాధ్యతలని తుప్పరివాళన్ మూవీ కోసం విశాల్ నిర్వహించబోతున్నాడు. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం లండన్, అజర్‌బైజాన్, మాల్టాలో ప్రాంతాలలో ఉండబోతోందని విశాల్ తెలిపాడు. ఇప్పటికే షూటింగ్ కోసం అక్కడికి వెళ్లడం జరిగిందంట.

డిటెక్టివ్ కి మించిన యాక్షన్ సన్నివేశాలతో పాటు థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ ఎలిమినెంట్స్ ఈ మూవీలో ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెల్ లో మరొక కేసు ఇన్వెస్టిగేషన్ ఉండబోతోందంట. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మరి ఈ మూవీతో విశాల్ దర్శకుడిగా ఎంత వరకు ప్రూవ్ చేసుకుంటాడు అనేది వేచి చూడాలి. మూవీ హిట్ అయితే మాత్రం దర్శకుడిగా మరిన్ని సినిమాలు విశాల్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు.