Begin typing your search above and press return to search.

'హాయ్ నాన్న' ఈవెంట్ లో విజయ్, రష్మిక ఫోటోలు.. సుమ సీరియస్

మూవీ యూనిట్ సుమా కనకాల హోస్ట్ గా వ్యవహరించిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ అనుకొని సంఘటన జరిగింది.

By:  Tupaki Desk   |   30 Nov 2023 5:56 AM GMT
హాయ్ నాన్న ఈవెంట్ లో విజయ్, రష్మిక ఫోటోలు..  సుమ సీరియస్
X

నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం 'హాయ్ నాన్న'. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నిన్న రాత్రి వైజాగ్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. మూవీ యూనిట్ సుమా కనకాల హోస్ట్ గా వ్యవహరించిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ అనుకొని సంఘటన జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.


హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా LED స్క్రీన్ పై అనుకోకుండా రష్మిక, విజయ్ దేవరకొండ ఫోటోలు కనిపించడం అక్కడున్న వారందరినీ షాక్ కి గురి చేసింది. ఇది చూసిన నాని, మృణాల్ ఠాకూర్ సైతం ఆశ్చర్యపోయారు. ఈ ఈవెంట్ లో భాగంగా సుమ నాని, మృణాళి ఠాకూర్ ఇద్దరినీ స్క్రీన్ పై కొన్ని ఫోటోలు చూపించి దీని మీద మీ కామెంట్స్ చెప్పండి అని అడిగింది.

ఈ క్రమంలోనే సంబంధమే లేకుండా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ ఒకే స్పాట్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు స్క్రీన్ పై ప్లే అవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో సుమ అక్కడున్న ఫోటోగ్రాఫర్ పై సీరియస్ అవుతూ అతని కాలర్ పట్టుకుని.." రేయ్ నువ్వేనా ఆ ఫోటోలు తీసింది. ఇలాంటి పిక్చర్స్ తీయొచ్చా? ఎంత సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అయితే ప్రైవసీ ఉండదా? అసలు ఏదంటే అది పెట్టడమేనా?" అంటూ ఆ ఫోటోగ్రాఫర్ పై సీరియస్ అయింది.

దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఈవెంట్స్ లో వాళ్ల పర్సనల్ ఫొటోస్ స్క్రీన్ పై చూపించడం కరెక్ట్ కాదని కొందరు అంటుంటే, వాళ్ల పర్సనల్ ఫోటోలను ఇలా అందరి ముందు చూపించడం తప్పు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఏదేమైనా నాని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ రష్మిక పర్సనల్ ఫోటోలు స్క్రీన్ పై చూపించడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక హాయ్ నాన్న సినిమా విషయానికొస్తే.. ఇప్పటికే సాంగ్స్ ట్రైలర్ తో ఆడియన్స్ లో ఈ సినిమాపై మంచి పాజిటివ్ హైప్ క్రియేట్ అయింది. తండ్రీ, కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కగా తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.