Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్‌ కెరీర్‌లో మ‌ళ్లీ 'ఖుషీ' మొద‌ల‌వుతుందా?

ఇది ఇండ‌స్ట్రీలో మాత్ర‌మే సాధ్యం. అందుకు చాలా మంది హీరోలు డిజాస్ట‌ర్లు ఎదురైనా మ‌ళ్లీ బ్లాక్ బ‌స్ట‌ర్‌తో బౌన్స్ బ్యాక్ కావ‌డానికి రెడీ అవుతుంటారు

By:  Tupaki Desk   |   31 Aug 2023 4:42 AM GMT
రౌడీ స్టార్‌ కెరీర్‌లో మ‌ళ్లీ ఖుషీ మొద‌ల‌వుతుందా?
X

చాలా వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో స‌ర్వే అవుతున్న హీరోల్లో అత్య‌ధిక శాతం మంది స్టార్‌లుగా నిల‌బ‌డే క్ర‌మంలో కెరీర్‌లో ఎదురు దెబ్బ‌లు తిన్న‌వారే.. ఊహించ‌ని ఫ్లాప్‌లు..షాక్ ఇచ్చే డిజాస్ట‌ర్ల‌ని ఎదుర్కొన్న వారే. ఇక్క‌డ ప్ర‌తి ఫ్రైడే జాత‌కాలు మారిపోతుంటాయి. ఎవ‌రు ఎప్పుడు ఎలా లైమ్ లైట్‌లోకి వ‌స్తారో.. ఎవ‌రు ఎప్పుడు ఎలా తెర‌మ‌రుగ‌వుతారో చెప్ప‌డం క‌ష్టం. ఇది తెలిసి కూడా స్టార్‌లు వెల‌గాల‌ని చాలా మంది బాక్సాఫీస్ వ‌ద్ద ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల్లా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. ఒక్క సినిమా స‌రైంది ప‌డితే తామేంటో చూపిస్తూ రాత్రికి రాత్రి స్టార్‌లుగా మారిపోతుంటారు.

ఇది ఇండ‌స్ట్రీలో మాత్ర‌మే సాధ్యం. అందుకు చాలా మంది హీరోలు డిజాస్ట‌ర్లు ఎదురైనా మ‌ళ్లీ బ్లాక్ బ‌స్ట‌ర్‌తో బౌన్స్ బ్యాక్ కావ‌డానికి రెడీ అవుతుంటారు. ఇప్పుడు రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఇదే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ని న‌మ్మి రెండేళ్ల స‌మ‌యం వెచ్చించి, శారీర‌కంగా, మాన‌సికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొని విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన సినిమా 'లైగ‌ర్‌'. మైక్ టైస‌న్‌ని కూడా రంగంలోకి దించేసి నానా హ‌డావిడి చేసిన ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎద‌గాల‌ని రౌడీ హీరో ఎన్నో క‌ల‌లు క‌న్నాడు.

ఒళ్లు కాయ‌లు కాసేలా శ్ర‌మించాడు. కానీ ఫ‌లితం మాత్రం శూన్యం. పూరి చేసిన త‌ప్పుల వ‌ల్ల 'లైగ‌ర్‌' బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చింది. ఒక్క‌సారిగా విజ‌య్ ఆకాశం నుంచి పాతాళానికి జారిపోయాడు అనేంత‌గా విమర్శ‌లు వినిపించాయి. సినిమా ప్ర‌మోష‌న్స్ సంద‌ర్భంగా మీడియాతో విజ‌య్ వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌ట్ల కూడా కామెంట్లు రావ‌డంతో విజ‌య్ గ్రాఫ్ చాలా వ‌ర‌కు ప‌డిపోయింది. నెక్ట్స్ ఏంటీ? అనే ప‌రిస్థితికి వెళ్లిన నేప‌థ్యంలో అత‌నికి ల‌భించిన సినిమా 'ఖుషీ'.

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. 'ద‌ర్మ‌న‌' పాట‌తో వైర‌ల్ అయిన మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు హేష‌మ్ అబ్దుల్ వాహెబ్ అంత‌దించిన సంగీతం 'ఖుషీ'కి ప్ర‌ధాన హైలైట్. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పాట‌లు సినిమాపై అంచ‌నాల్ని ఊపెంచేశాయి. ఓ జంట‌ ప్రేమ‌, పెళ్లి, వైవాహిక జీవితం నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియా వైడ్‌గా తెలుగుతో పాటు ఐదు భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో త‌న కెరీర్‌లో మ‌ళ్లీ 'ఖుషీ' మొద‌ల‌వుతుంద‌ని రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాడు. స‌మంత హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిస్తే విజ‌య్ కెరీర్‌లోనే కాదు స‌మంత కెరీర్‌లోనూ 'ఖుషీ' మ‌ళ్లీ మొద‌లు కావ‌డం ఖాయం.