Begin typing your search above and press return to search.

నా గ‌ర్భంలో మోసాన‌మ్మా..ఒక్క మాట చెప్పాల‌నిపించ‌లేదా!

ఇక చివ‌రిగా ల‌వ్ యూ ఆల్..మిస్ యూ ఆల్ లేఖ‌ని ముగిచింది మీరా. ఆ లేఖ‌ని మీరా నోట్ బుక్ నుంచి స్వాదీనం చేసుకున్న‌ట్ల తెలుస్తోంది

By:  Tupaki Desk   |   21 Sep 2023 10:29 AM GMT
నా గ‌ర్భంలో మోసాన‌మ్మా..ఒక్క మాట చెప్పాల‌నిపించ‌లేదా!
X

విజ‌య్ ఆంటోనీ-ఫాతిమాల ముద్దుల కుమార్తె మీరా బ‌ల‌వ‌న్మ‌ర‌ణం అంద‌రి హృద‌యాల్ని క‌లచివేసిన సంగ‌తి తెలిసిందే. త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీర‌వుతోన్న‌ వైనం అంద‌ర్నీ శోక‌సంద్రంలో ముంచేస్తుంది. విజ‌య్ త‌మిళ న‌టుడైనా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన న‌టుడు. వ్య‌క్తిగ‌తంగా ఇక్క‌డి అభిమానులు ఆయ‌న్ని ఎంత‌గానో ఆద‌రిస్తారు. గొప్ప మ‌న‌స్త‌త్వం...స్వ‌భావం క‌ల‌వాడు అలాంటి వ్య‌క్తితి ఇలా జ‌రిగిందేం ట‌ని ప్రేక్షకాభిమానులు బాధ‌ప‌డుతున్నారు.

తాజాగా మీరా గ‌దిలో సూసైడ్ నోట ఒక‌టి దొరికిన‌ట్లు తెలుస్తోంది. చెన్నై పోలీసులు ఆ లేఖ‌ను స్వాదినం చేసుకుని అందులో ఏం రాసిందో? ఆ లేఖ నిజంగా ఆమె రాసిందా? అన్న వివ‌రాలు ధృవీక‌రించు కుంటున్నారు. ఆ లేఖ‌లో మీరా త‌న స్నేహితుల‌ను..టీచ‌ర్ల‌ను మిస్ అవుతున్న‌ట్లు తెలిపింది. అలాగే త‌న మ‌ర‌ణం వ‌ల్ల కుటుంబం ఎంతో బాధ‌ప‌డుతుంద‌ని ..ధైర్యంగా ఉండాల‌ని ఆ లేఖ‌లో పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది.

ఇక చివ‌రిగా ల‌వ్ యూ ఆల్..మిస్ యూ ఆల్ లేఖ‌ని ముగిచింది మీరా. ఆ లేఖ‌ని మీరా నోట్ బుక్ నుంచి స్వాదీనం చేసుకున్న‌ట్ల తెలుస్తోంది. అయితే ఆ లేఖ ఏ రోజున రాసింది. ఆత్మ‌హ‌త్య‌కు కొన్ని నిమిషాల ముందు రాసిందా? లేక అంత‌కు ముందు గానే రాసి పెట్టుకుందా? నిజంగా ఆ రాత శైలి ఆమెదానా? అన్న కోణంలో విచార‌ణ చేస్తున్నారు. ఆ లేఖ చూసి త‌ల్లిదండ్రులు మ‌రింత దుఖసాగ‌రానికి గుర‌వుతున్నారు.

'నిన్ను నా గ‌ర్భంలో మోసాన‌మ్మ‌. నాతో ఒక్క మాట కూడా చెప్పాల‌నిపించ‌లేదా? అని పాతిమా క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. కుమార్తె తో చివ‌రి సారిగా మాట్లాడిన మాట‌ల్ని గుర్తు చేసుకుని త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. ప్ర‌స్తుతం విజ‌య్ ఆంటోని ఇంటి చుట్టూ విషాధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. మీరా 19వ తేదీన తెల్ల‌వారు జామున ఉరివేసుకున్న సంగ‌తి తెలిసిందే.