Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ తో ఫైట్ చేయబోయే స్టార్ యాక్టర్ ఎవరు...?

By:  Tupaki Desk   |   24 Jun 2020 3:30 PM GMT
సూపర్ స్టార్ తో ఫైట్ చేయబోయే స్టార్ యాక్టర్ ఎవరు...?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'సర్కారు వారి పాట' ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ - జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ సినిమా అనుకున్నప్పటి నుండి హీరోయిన్ విషయంలో డైలీ ఏదొక న్యూస్ వస్తూనే ఉంది. చివరికి 'మహానటి' కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారు. ఇక అప్పటి నుంచి ఈ సినిమాలో మహేష్ కి ప్రతినాయకుడిగా ఎవరు నటించబోతున్నారంటూ సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే శాండిల్ వుడ్ స్టార్ హీరోలు ఉపేంద్ర మరియు కిచ్చా సుధీప్ ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పడు తాజాగా అరవింద్ స్వామి 'సర్కారు వారి పాట'లో విలన్ గా నటించబోతున్నాడు అంటూ మరో న్యూస్ వచ్చింది.

అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్స్ ఉపేంద్ర - అరవింద్ స్వామిలలో ఎవరో ఒకరిని నెగిటివ్ రోల్ కి తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించిన ఉపేంద్ర ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక 'ధృవ' సినిమాలో విలన్ గా కనిపించిన అరవింద్ స్వామి కోలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. వీరిద్దరిలో ఎవరిని మహేష్ కి విలన్ గా తీసుకున్నా మంచిదే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారట. ఎవరైనా మహేష్ తో ఫ్రెష్ కాంబో అవుతుందని.. ఇతర ఇండస్ట్రీలలో కూడా మార్కెట్ పరంగా ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి చివరికి ఇద్దరిలో ఎవరికి ఓటు వేస్తారో చూడాలి.

ఇదిలా ఉండగా సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతున్న 'సర్కారు వారి పాట' పై అటు మహేష్ ఫ్యాన్స్ లోనూ ఇటు సినీ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే అనౌన్స్మెంట్ పోస్టర్ లో చెవికి రింగు.. రఫ్ గా కనిపించేలా గడ్డం.. మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో మాసీ లుక్ లో మహేష్ అదరగొట్టాడు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా ఏయస్ ప్రకాష్ పని చేస్తుండగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేయబోతున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. కరోనా పరిస్థితులు కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది.