Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ 'బాషా'ను గుర్తు చేసిన ర‌జ‌నీ

అయితే ఈ పోస్ట‌ర్ లో ఐకానిక్ లుక్ ర‌జ‌నీకి కొత్తేమీ కాదు. ఇది చాలా సినిమాల‌లో ఇప్ప‌టికే చూసేసిన లుక్. అయితే అత‌డు మునుప‌టి కంటే ఎంతో ఎన‌ర్జిటిక్ పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని హింట్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   15 Jan 2024 10:40 AM GMT
మ‌ళ్లీ బాషాను గుర్తు చేసిన ర‌జ‌నీ
X

'జై భీమ్' దర్శకుడు TJ జ్ఞానవేల్‌తో రజనీకాంత్ చిత్రం ప్రకటించినప్పటి నుండి అభిమానుల్లో అది ఆస‌క్తిని పెంచింది. డిసెంబర్ 12 న ర‌జ‌నీ 73వ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రత్యేక టీజర్‌తో పాటు 'వేట్టైయన్' అనే టైటిల్‌ను ప్ర‌క‌టించారు. 57 సెకనుల టైటిల్ టీజర్ లో రజనీకాంత్ ఎంతో స్పెష‌ల్ గా క‌నిపించారు. ఈ కొత్త లుక్ హైప్ క్రియేట్ చేసింది. తాజాగా పొంగల్ సందర్భంగా.. ఈ చిత్రం నుండి సరికొత్త పోస్టర్‌ను చిత్ర‌బృందం షేర్ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది టీమ్.


అయితే ఈ పోస్ట‌ర్ లో ఐకానిక్ లుక్ ర‌జ‌నీకి కొత్తేమీ కాదు. ఇది చాలా సినిమాల‌లో ఇప్ప‌టికే చూసేసిన లుక్. అయితే అత‌డు మునుప‌టి కంటే ఎంతో ఎన‌ర్జిటిక్ పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని హింట్ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ లుక్ 1995 సంచ‌ల‌న‌ చిత్రం 'బాషా'ను గుర్తు చేస్తోంది. ఆప‌న్నుల కోసం స్నేహం కోసం బంధం కోసం నేనున్నాన‌ని హామీ ఇచ్చే ప‌వ‌ర్ ఫుల్ నాయ‌కుడిలా క‌నిపిస్తున్నాడు ర‌జ‌నీ. నిజానికి ఇది బాషా సీక్వెల్ అయితే ఎంత బావుంటుంది అని కోరుకునే అభిమానులు ఉన్నారు. మాణిక్ బాషా తిరిగి వ‌స్తే చూడాల‌ని అంతా ఆశ‌ప‌డుతున్నారు.

వెట్టయన్ గురించి..

'వెట్టయాన్‌'లో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ అవతార్‌లో కనిపిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. పుట్టినరోజున విడుదలైన ఈ చిత్రం టీజర్ లో పోలీసు గ్రేడ్ షూ ధ‌రించి లాఠీతో క‌నిపించ‌డంతో కొంత స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషార విజయన్ ప్ర‌ధాన‌ పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సుబ్రమణ్యపురం - జై భీం లాంటి విల‌క్ష‌ణ చిత్రాల‌తో పేరుగాంచిన SR కత్తిర్ ఈ చిత్రానికి కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... నెల్సన్ దిలీప్‌కుమార్ డార్క్ కామెడీ చిత్రం జైలర్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న‌ రజనీకాంత్ తదుపరి త‌న‌ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తెర‌కెక్కించిన‌ స్పోర్ట్స్ డ్రామా లాల్ సలామ్‌లో మొయిదీన్ భాయ్‌గా అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విక్ర‌మ్ ఫేం లోకేష్ కనగరాజ్‌తో తలైవర్ 171 లోను న‌టిస్తున్నారు. రాఘవ లారెన్స్, శివకార్తికేయన్, జీవా కూడా ఇందులో కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. అన్బరీవ్ మాస్టర్స్ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా ఎంపికయ్యారు.