Begin typing your search above and press return to search.

సీతాఫ‌లాల‌తో ఫ్యాన్స్ ని ఇలా కూల్ చేస్తున్నారా?

తాజాగా వీణా శ్రీవాణి పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కి త‌న తోట సీతాఫ‌లాల్ని పంపించి మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారారు.

By:  Tupaki Desk   |   16 April 2024 1:30 PM GMT
సీతాఫ‌లాల‌తో  ఫ్యాన్స్ ని ఇలా కూల్ చేస్తున్నారా?
X

సెల‌బ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. జాత‌కాల‌తోనే ఈయ‌న ఫేమ‌స్ అయిపోయాడు. ఇక ఆయ‌న భార్య శ్రీవాణి అలియాస్ వీణా శ్రీవాణి గురించి కూడా చెప్పాల్సిన ప‌నిలేదు. సోష‌ల్ మీడియాలో ఎంతో ఫేమస్ ఆవిడ‌. వీణ‌తోనే పాట‌ల్ని హ‌మ్ చేయ‌డం ఆమె ప్ర‌త్యేక‌త‌. అలా భార్య భ‌ర్త‌లిద్ద‌రు ఎంతో ఫేమ‌స్. తాజాగా వీణా శ్రీవాణి పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కి త‌న తోట సీతాఫ‌లాల్ని పంపించి మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారారు.

'ప్ర‌తీ ఏటా సీతాఫ‌లాలు తెలిసిన వారికి పంపిస్తుంటాం. ఈసారి ప్ర‌భాస్ గారికి పంపించాం. ఓ స్పెష‌ల్ ప‌ర్సన్ ద్వారా ఆ ఫ‌లాలు ప్ర‌భాస్ కి చేరాయి. ఆయ‌న రుచి చూసి చాలా బాగున్నాయి. ఇంకా కావాల‌ని అడిగారు. అంత పెద్ద స్టార్ అడిగితే పంప‌కుంటా ఉంటామా? అందుకే బాస్కెట్ నిండా మ‌ళ్లీ పంపించాను. అలాగే నా గుర్తుగా ఓ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ని కూడా పంపించాను. ఈ సంవ‌త్స‌రం ఇదే చివ‌రి పంట‌. వ‌చ్చే ఏడాది మ‌ళ్లీ క‌లుద్దాం' అంటూ రివీల్ చేసారు. దీంతో ప్ర‌భాస్ అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇక ప్ర‌భాస్ గురించి వేణుస్వామి గ‌తంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న జాత‌కం చూసి పెళ్లి అవ్వ‌ద‌ని....స్టార్ గా ఎక్కువ‌గా కొన‌సాగ‌లేడ‌ని....సినిమా వ‌సూళ్లు కూడా ఇంత‌కు ముందులా ఉండ‌వ‌ని అన్నాడు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ వేణుస్వామిపై ఎటాకింగ్ దిగారు.

ప్ర‌తీగా గురూజీ కూడా ఏం తగ్గ‌లేదు. తాను చెప్పందే జ‌రుగుతుంద‌ని... జ‌రిగిదే చెబుతాన‌న‌ని...త‌న‌ని ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా...ట్రోలింగ్ చేసినా ప‌ట్టించుకోను అన్నాడు. మ‌రి అప్పుడు ఈ వివాదం..వీణా వాణీ సీతా ఫ‌లాలు పంపండం నెట్టింట చ‌ర్చకొస్తున్నాయి.

ఇలా పండ్ల‌ను పంపించ‌డం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి కూడా ఓ హాబీ. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌తీ ఏటా త‌న మామిడి తోటలో పండిన పండ్ల‌ను టాలీవుడ్ త‌న‌కు న‌చ్చిన హీరోల‌కు పంపించ‌డం అల‌వాటు. ఆయ‌న పండించిన మామిడి పండు తినాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఆలిస్ట్ లో నితిన్ కూడా ఉన్నాడు. ఓసారి మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడికి కూడా ప‌వ‌న్ ఇంట మామిడి పండ్లు వెళ్లిన‌ట్లు ప్ర‌చారంలోకి వచ్చింది.