Begin typing your search above and press return to search.

వెంకటేష్ క్రేజీ కాంబో… ఆ ఇద్దరిలో ఒకరు

వీరిలో ఒకరు వెంకటేష్ కోసం కథ సిద్ధం చేసుకున్నారంట. త్వరలో నేరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు. ఒక వేళ కథ నచ్చితే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందంట.

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:53 AM GMT
వెంకటేష్ క్రేజీ కాంబో… ఆ ఇద్దరిలో ఒకరు
X

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ఈ సినిమాని శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా సిద్ధం అవుతోంది. దీని తర్వాత విక్టరీ వెంకటేష్ దిల్ రాజు బ్యానర్ లో మూవీకి కమిట్ అయ్యారంట.

ఎఫ్ 2 సిరీస్ ద్వారా విక్టరీ వెంకటేష్ తో దిల్ రాజు రెండు హిట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ సారి సోలోగా వెంకటేష్ తో మూవీ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాదిలో బలగం సినిమాతో కమెడియన్ వేణు దర్శకుడిగా టర్న్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దిల్ రాజు సెకండ్ బ్యానర్ లో వచ్చిన ఈ చిన్న సినిమా సూపర్ సక్సెస్ ని అతనికి అందించింది. దీంతో వేణుతో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ లో మరో మూవీ చేస్తానని దిల్ రాజు గతంలోనే ప్రామిస్ చేశారు.

దసరా మూవీతో శ్రీకాంత్ ఒదేల సూపర్ హిట్ కొట్టాడు. సుకుమార్ శిష్యుడిగా పరిచయం అయిన గురువు నీడ తనపై పడకుండా సోలోగా ప్రూవ్ చేసుకున్నారు. వంద కోట్ల మూవీని నానికి అందించాడు. దిల్ రాజు శ్రీకాంత్ ఒదేలతో ఒక మూవీకి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు దర్శకులతో ఒకరితో విక్టరీ వెంకటేష్ హీరోగా మూవీ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారంట.

వీరిలో ఒకరు వెంకటేష్ కోసం కథ సిద్ధం చేసుకున్నారంట. త్వరలో నేరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు. ఒక వేళ కథ నచ్చితే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందంట. త్వరలో దీనికి సంబందించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తనకి సెట్ అయ్యే కథలని ఎంపిక చేసుకుంటూ స్లో ఫేజ్ లో మూవీస్ చేస్తున్నారు. గురు, నారప్ప సినిమాల తర్వాత గ్యాప్ తీసుకొని శైలేష్ కొలనుతో సైంధవ్ మూవీ చేస్తున్నారు.

అయితే ఇకపై ఏడాదికి ఒక సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే సైంధవ్ మూవీ రిలీజ్ కి ముందే మరో సినిమాని ఎనౌన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారని టాక్. అనుదీప్ కేవీతో సురేష్ బాబు వెంకటేష్ హీరోగా ఒక సినిమా చేయాలని అనుకున్నారు. అయితే స్టొరీ సంతృప్తికరంగా లేకపోవడంతో సురేష్ బాబు దానిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఇప్పుడు లైన్ లోకి వచ్చి వెంకటేష్ నెక్స్ట్ సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు టాక్.