Begin typing your search above and press return to search.

వీడియో: VD- స‌మంత రొమాంటిక్ సీన్ వైర‌ల్

సినిమా విడుదలైన కొన్ని గంటల తర్వాత సమంత - విజయ్ జంట న‌డుమ‌ ఇంటిమేట్ సీన్ వీడియో సోషల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 4:58 AM GMT
వీడియో: VD- స‌మంత రొమాంటిక్ సీన్ వైర‌ల్
X

సమంత రూత్ ప్రభు- విజయ్ దేవరకొండ జంట‌గా న‌టించిన‌ 'ఖుషి' గ‌త శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఈ రొమాంటిక్ డ్రామా విమర్శకులు అభిమానుల నుండి సానుకూల స్పందనను పొందుతోంది. సినిమా విడుదలైన కొన్ని గంటల తర్వాత సమంత - విజయ్ జంట న‌డుమ‌ ఇంటిమేట్ సీన్ వీడియో సోషల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ వైరల్ వీడియోలో సమంత - దేవరకొండ న‌డుమ రొమాన్స్ ప్ర‌ధానంగా ఎలివేట్ అయ్యింది.

ఈ క్లిప్ ని X (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు) ఖాతాలో షేర్ చేస్తూ నెటిజనులు వైరల్ చేస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ నుంచి ర‌క‌ర‌కాల వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. "ఎంత క్యూట్ గా ఉన్నారో ఇద్దరు" అంటూ ఒక నెటిజ‌న్ ఈ వీడియోపై వ్యాఖ్యానించాడు. అంద‌మైన జంట అంటూ మ‌రొక నెటిజ‌న్ ప్ర‌శంసించాడు. నిజానికి ఈ క్లిప్ వైర‌ల్ కాక‌ ముందే సినిమా చూసిన వారంతా.. విజయ్- స‌మంత జంట పెద్ద తెర‌పై ఎంతో చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నారని, ఇరువురి న‌డుమా రొమాన్స్ కెమిస్ట్రీ అద్భుతంగా పండాయ‌ని ప్ర‌శంసిస్తున్నారు. ఇది కేవ‌లం ఛ‌మ‌క్కుమ‌ని మెరిసి వెళ్లిపోయే సీన్. కొత్త‌గా పెళ్ల‌యిన జంట నడుమ రొమాంటిక్ సీన్.. ఒక పాట‌లో ఇలా వ‌చ్చి అలా వెళుతుంది. ఇక విజ‌య్ - స‌మంత జంట ఇంత‌కుముందు 'మ‌హాన‌టి' చిత్రంలోను ఎంతో ముచ్చ‌ట‌గా క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ జోడీ రొమాన్స్ రిపీటెడ్ గా వ‌ర్క‌వుట‌వుతోంది గ‌నుక మునుముందు మ‌రిన్ని సినిమాల్లో క‌లిసి న‌టిస్తార‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

శుక్రవారం - రిలీజ్ డే విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఖుషీ చిత్రానికి లభిస్తున్న రెస్పాన్స్ ఆనందాన్నిచ్చింద‌ని వ్యాఖ్యానించారు. తన సినిమాపై ప్రేమను కురిపించినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. "మీరంతా నాతో పాటు 5 సంవత్సరాలుగా వేచి ఉన్నారు. నా పని నేను ఉత్త‌మంగా చేస్తానని ఓపికగా ఎదురు చూస్తున్నాను! మేము అనుకున్న‌ది సాధించాం ఈరోజు!! అంద‌రి నుండి ఈ ఆనందాన్ని మేల్కొలపడానికి ఒక ప్ర‌య‌త్నం చేసాం. నా ఫోన్‌కు వందల కొద్దీ సందేశాలు వచ్చాయి. నేను భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండ‌లేక‌పోయాను" అని విజయ్ రాశాడు. రొమాంటిక్ డ్రామా ఖుషీ లో సచిన్ ఖేద్క‌ర్, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించింది.