Begin typing your search above and press return to search.

రవితేజ.. మిస్సయిన మరో క్రేజీ కాంబో

కథ మీద చాలా రోజులు వర్క్ చేశానని అయితే బడ్జెట్ ఎక్కువ ఉండటం వలన ఆ మూవీ క్యాన్సిల్ అయ్యిందని క్లారిటీ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   15 Jan 2024 4:36 AM GMT
రవితేజ.. మిస్సయిన మరో క్రేజీ కాంబో
X

మాస్ మహారాజ్ రవితేజ టాలీవుడ్ లో ఎంతో మంది కొత్త దర్శకులని ఎంకరేజ్ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. కథ నచ్చితే ఛాన్స్ ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్స్ గా ఉన్న చాలా మంది రవితేజ సినిమాతోనే కెరియర్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న కూడా కొత్త దర్శకులకి రవితేజ ఛాన్స్ లు ఇస్తూనే ఉంటాడు.

రవితేజ తర్వాత కళ్యాణ్ రామ్, నితిన్ ఎక్కువగా కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అలా కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమా చేసి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ట మల్లిడి. ఈ యంగ్ డైరెక్టర్ కి ఇదే మొదటి సినిమా. భారీ బడ్జెట్ తో టైం ట్రావెల్ ఎలిమెంట్ తో ఈ మూవీ తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రం కంటే ముందుగానే వశిష్ట మల్లిడి రవితేజతో సినిమా చేయాల్సి ఉందంట.

బింబిసార కంటే ముందుగా రవితేజకి కథ చెప్పడం జరిగిందని, ఆ స్టొరీ అతనికి భాగా నచ్చిందని వశిష్ట ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కథ మీద చాలా రోజులు వర్క్ చేశానని అయితే బడ్జెట్ ఎక్కువ ఉండటం వలన ఆ మూవీ క్యాన్సిల్ అయ్యిందని క్లారిటీ ఇచ్చాడు. అయితే రవితేజ మాత్రం తనని చాలా ఎంకరేజ్ చేశారని తెలిపారు. నా ఊహలు, ఆలోచనలు చాలా పెద్దగా ఉండేవి.

అయితే నా మొదటి సినిమాకి ఆ స్థాయిలో బడ్జెట్ పెట్టడానికి ఎవరూ ముందుకి రాలేదు. ఈ కారణంగానే రవితేజతో అనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పాడు. తరువాత అల్లు శిరీష్ తో మూవీ ప్లాన్ చేయడం జరిగిందని, అది ప్రారంభోత్సవం కూడా జరిగిందని, మరల బడ్జెట్ కారణంగానే ఆగిపోయిందని వశిష్ట మల్లిడి క్లారిటీ ఇచ్చాడు.

ఇలా ఆరంభంలోనే రెండు సినిమాలు బడ్జెట్ కారణంగానే ఆగిపోయాయని వశిష్ట ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలిన బింబిసారతో సూపర్ హిట్ కొట్టి ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ చేసే అవకాశం సొంతం చేసుకున్నారు.