Begin typing your search above and press return to search.

వరుణ్ బాలీవుడ్ బాక్సాఫీస్.. ఏమవుతుందో..?

శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కింది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 3:59 AM GMT
వరుణ్ బాలీవుడ్ బాక్సాఫీస్.. ఏమవుతుందో..?
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. మానుషీ చిల్లర్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సినిమాలో నటించిన వారిలో చాలా మంది హిందీ యాక్టర్స్ కావడం విశేషం.

ఈ సినిమాని నిర్మించిన సోనీ పిక్చర్స్ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ గా ఉంది. ఈ కథాంశం కూడా పుల్వామా ఘటన తర్వాత పాకిస్థాన్ పై ఇండియా జరిపిన ఎయిర్ ఎటాక్ నేపథ్యంలో ఉండబోతోంది. ఓవరాల్ గా ఆపరేషన్ వాలంటైన్ తెలుగు సినిమాగా కంటే హిందీ చిత్రంగానే తెరకెక్కింది. అయితే ఈ మూవీకి మార్కెట్ లో మాత్రం తెలుగు సినిమా అనే ఇమేజ్ ఉంది.

ఈ మధ్యకాలంలో సౌత్ హీరోలకి నార్త్ ఇండియాలో పట్టం కడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్, రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్ బాలీవుడ్ లో సత్తా చాటారు. అయితే మీడియం రేంజ్ హీరోలతో వచ్చిన కార్తికేయ 2, సీతారామం, హనుమాన్ చిత్రాలు మాత్రమే నార్త్ ఇండియాలో ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. చాలా మంది పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేసి ప్రయత్నం చేస్తోన్న ఆదరణ లభించడం లేదు.

ఆపరేషన్ వాలంటైన్ చిత్రాన్ని మాత్రం ఎక్కువగా నార్త్ ఇండియాలోనే ప్రమోట్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ అక్కడ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. పబ్లిక్ లోకి వెళ్లి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. నిర్మాణ సంస్థ కూడా బాలీవుడ్ మూవీగానే దీనిని ప్రచారం చేస్తోంది. అందుకే నార్త్ ఇండియాలో ఆపరేషన్ వాలంటైన్ పైన కొంత బజ్ ఉంది. కరెక్ట్ గా వర్క్ అవుట్ చేస్తే మాత్రం వరుణ్ తేజ్ ఈ చిత్రంతో బాలీవుడ్ లో సత్తా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై తమ ముద్ర వేశారు. ఇప్పుడు వారి దారిలో వరుణ్ తేజ్ కూడా ఆపరేషన్ వాలంటైన్ తో సత్తా చాటితే నెక్స్ట్ మూవీ నుంచి అతనికి నార్త్ ఇండియాలో కూడ మంచి మార్కెట్ స్కోప్ దొరుకుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.