Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: వరలక్ష్మి శరత్ కుమార్ ఏమ‌న్నారు?

త‌మిళం-తెలుగులో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ ఆక‌ట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపించిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Oct 2023 4:16 AM GMT
డ్రగ్స్ కేసు: వరలక్ష్మి శరత్ కుమార్ ఏమ‌న్నారు?
X

త‌మిళం-తెలుగులో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టిస్తూ ఆక‌ట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల‌ వరలక్ష్మీ శరత్ కుమార్‌కు ఎన్ఐఏ సమన్లు జారీ చేసిందని క‌థ‌నాలొచ్చ‌యి. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కేరళలో డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్నారని ప్ర‌చార‌మైంది. ఆగస్టు 18న కేరళలోని వినియం బీచ్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీ విఘ్నేష్ అనే ఫిషింగ్ బోట్ నుంచి ఎన్ఐఏ అధికారులు దాదాపు 300 కిలోల హెరాయిన్, ఒక ఏకే 47 రైఫిల్, 17 రౌండ్ల బుల్లెట్లు, ఐదు 9 ఎంఎం పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఆదిలింగం కీలక నిందితుడు. దీంతో ఆదిలింగం వివరాలను సేకరించేందుకు విచారణకు హాజరుకావాలని వరలక్ష్మి శరత్ కుమార్‌కు ఎన్ఐఏ ఆదేశాలు జారీ చేసింది. కొచ్చి కార్యాలయంలో వరలక్ష్మి శరత్ కుమార్‌ను అధికారులు విచారించారు. ఆదిలింగతో ఆమెకున్న అనుబంధంపై స్టేట్‌మెంట్‌ నమోదు చేయనున్నారు. డ్రగ్స్ ద్వారా సంపాదించిన సొమ్మును ఆదిలింగం సినిమాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్న‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. ఈ విషయమై వరలక్ష్మి శరత్ కుమార్‌ను కూడా ఎన్ఐఏ ప్రశ్నించింద‌ని మీడియాలు వెల్ల‌డించాయి. మరోవైపు ఎన్‌ఐఏ అధికారులు వరలక్ష్మి శరత్ కుమార్ ఎక్స్‌పీఏ ఆదిలింగంతో పాటు మరో ఐదుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

వ‌ర‌ల‌క్ష్మి ఏమంటున్నారు?

అయితే ఈ కేసుతో త‌న‌కు ఏ సంబంధం లేద‌ని వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ ప‌లుమార్లు మీడియాకు వెల్ల‌డించారు. ఇప్పుడు మ‌రోసారి త‌న‌పై సాగుతున్న ప్ర‌చారాన్ని ఖండించారు. త‌న మాజీ ఫ్రీల్యాన్స్ మేనేజ‌ర్ ఆదిలింగం ఈ కేసులో ఇరుక్కున్నందున త‌న పేరును మీడియా డ్రాగ్ చేసింద‌ని వ‌ర‌ల‌క్ష్మి మ‌రోసారి ఆవేద‌న వ్య‌క్తం చేసారు. త‌న‌కు విచార‌ణ‌ అధికారులు నోటీసులు పంపాప‌ర‌న్న ప్ర‌చారంలో నిజం లేద‌ని వ‌ర‌ల‌క్ష్మి స్ప‌ష్ఠ‌త‌నిచ్చారు.

సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురుగా సినిమాల్లోకి వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ కోలీవుడ్ లో హీరోయిన్ గా అలరించింది. తర్వాత నటిగా మారి విలన్‌గా మారింది. నాంది, క్రాక్, యశోద, వీరసింహా రెడ్డిలలో ముఖ్యమైన పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకుంది. న‌టిగా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంది.