Begin typing your search above and press return to search.

వాళ్ళ పై సందీప్ ఫైర్.. అప్పుడు కూడా అలా చేశారంటూ!

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సినీ క్రిటిక్స్పై సందీప్ రెడ్డి వంగా విరుచుకుపడ్డారు. కొంతమంది క్రిటిక్స్కు సినిమాలపై అవగాహనే లేదని అన్నారు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 6:15 AM GMT
వాళ్ళ పై సందీప్ ఫైర్.. అప్పుడు కూడా అలా చేశారంటూ!
X

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక హీరోహీరోయిన్లుగా ఆయన తెరకెక్కించిన యానిమల్ మూవీ డీసెంట్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం యానిమల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సినీ క్రిటిక్స్ పై సందీప్ రెడ్డి వంగా విరుచుకుపడ్డారు. కొంతమంది క్రిటిక్స్ కు సినిమాలపై అవగాహనే లేదని అన్నారు. "దాదాపు ఐదేళ్లుగా ముంబయిలో ఉన్న తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఇక్కడ ఓ సినీ క్రిటిక్స్ టీమ్ ఉంది. వారు కేవలం ఒకే రకమైన చిత్రాలను ఇష్టపడతారు. వారు ఆ సినిమాలను తప్ప మిగతా మూవీలను ప్రశంసించరు. అర్జున్ రెడ్డి సమయంలోనూ ఇదే జరిగింది'' అని సందీప్ తెలిపారు

"సినీ క్రిటిక్స్ కు డబ్బులు ఇచ్చే సంస్కృతి సినీ ఇండస్ట్రీలో ఉంది. కానీ నేను అలా ఎప్పుడూ చేయలేదు. చేయను కూడా. నా సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఎప్పుడూ రివ్యూను ట్వీట్ చేయలేదు. రామ్ గోపాల్ వర్మకు పెద్ద ఫ్యాన్ కాబట్టి.. తొలిసారి ఆయన వర్క్కు రివ్యూ ఇచ్చాను. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన ఎంతో సహకారం అందించారు. ఆయనలా ఎవరూ చేయలేదు" అని సందీప్ చెప్పారు.

ఫాదర్ అండ్ సన్ యాక్షన్‌తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలు చేశారు. త్రప్తి డిమ్రీ ప్రధాన పాత్ర పోషించారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం యానిమల్ మూవీ 19 రోజుల్లో రూ.850 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.

ఇప్పుడు సందీప్ కొత్త ప్రాజెక్ట్ల కోసం సినీప్రియుల్లో ఆసక్తి నెలకొంది. మూడు సినిమాలకు ఆయన ఓకే చెప్పినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా ఇప్పటికే సందీప్ కమిట్ కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సూపర్ స్టార్ మహేశ్తో కూడా సినిమాలు చేయనున్నట్లు సమాచారం. వీటి తర్వాత యానిమల్ సినిమాకు సీక్వెల్ అయిన యానిమల్ పార్క్‌ను తెరకెక్కించాలని భావిస్తున్నారట.