Begin typing your search above and press return to search.

చిరు, బాలయ్యల తర్వాత వైష్ణవ్‌ తేజ్‌...!

దాంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఆదికేశవ సినిమా ను చేసిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   21 Nov 2023 6:31 AM GMT
చిరు, బాలయ్యల తర్వాత వైష్ణవ్‌ తేజ్‌...!
X

ఉప్పెన సినిమా తో హీరోగా మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్‌ తేజ్ మొదటి సినిమా తోనే వంద కోట్ల క్లబ్ లో చేరాడు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు కమర్షియల్ గా నిరాశ పరిచాయి. దాంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఆదికేశవ సినిమా ను చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నాగ వంశీ నిర్మించడం జరిగింది.

ఈ మధ్య కాలంలో సూపర్ హిట్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్ గా నిలుస్తున్న సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించడం వల్ల మంచి బిజినెస్ ను ఆదికేశవ చేసిందని సమాచారం అందుతోంది. ఈ వారంలో విడుదల అవ్వబోతున్న ఆదికేశవ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

తాజాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమాల రేంజ్‌ లో మాస్ సినిమా లు రాలేదు. ఏడాది ఆరంభంలో వచ్చిన ఆ రెండు సినిమాలు మాత్రమే మాస్ సినిమాలు. మధ్య లో పూర్తి స్థాయి మాస్ సినిమాలు రాకపోవడంతో ప్రేక్షకులు మాస్‌ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు.

వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి రేంజ్ లో మా ఆదికేశవ సినిమా మాస్‌ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుంది. మాస్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారిని మెప్పించే ఎలిమెంట్స్ ఈ సినిమా లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి 2023 లో చిరంజీవి, బాలయ్యల మాస్ సినిమాల తర్వాత వైష్ణవ్‌ తేజ్ ఆదికేశవ సినిమా మాత్రమే అసలైన మాస్ సినిమా అన్నట్లుగా నిర్మాత నాగ వంశీ పేర్కొన్నాడు.

సినిమాల ప్రమోషన్‌ ల సమయంలో తమ సినిమా ఆహా ఓహో అంటూ నిర్మాతలు, దర్శకులు ఇతర యూనిట్‌ సభ్యులు మాట్లాడటం కామన్ విషయం. అయితే ఆదికేశవ సినిమా గురించి నిర్మాత నాగ వంశీ చేసిన మాస్ వ్యాఖ్యలు నిజమే అన్నట్టు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది మరో మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.