Begin typing your search above and press return to search.

సీక్వెల్‌లో ఆమె ఎందుకు లేదంటే..!

రైడ్ 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అజయ్ దేవగన్‌తో పాటు హీరోయిన్‌ వాణి కపూర్ ఇతర యూనిట్‌ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు.

By:  Tupaki Desk   |   9 April 2025 11:30 PM
సీక్వెల్‌లో ఆమె ఎందుకు లేదంటే..!
X

అజయ్‌ దేవగన్ హీరోగా రాజ్‌ కుమార్‌ గుప్తా దర్శకత్వంలో రూపొందిన 'రైడ్‌ 2' సినిమా మే 1న విడుదల కాబోతుంది. 2018లో వచ్చిన రైడ్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రైడ్ సినిమాకు సీక్వెల్‌ అనగానే అందరూ అంచనాలు భారీగా పెంచుకున్నారు. రైడ్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన భారీ విజయం నేపథ్యంలో సీక్వెల్‌కి కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అజయ్‌ దేవగన్ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విషయాన్ని ఫ్యాన్స్‌తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

'రైడ్‌' సినిమాను తెలుగులో 'మిస్టర్‌ బచ్చన్‌' టైటిల్‌తో రీమేక్ చేసిన విషయం తెల్సిందే, రవితేజ హీరోగా నటించిన రీమేక్‌కి హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడు. భారీ అంచనాలు ఉన్న ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. మిస్టర్ బచ్చన్‌ సూపర్‌ హిట్ అయ్యి ఉంటే కచ్చితంగా 'రైడ్‌ 2' సినిమా రీమేక్ వార్తలు ఇప్పటికే వచ్చి ఉండేది. రవితేజ కచ్చితంగా రైడ్‌ 2 పై ఆసక్తి కనబర్చే అవకాశాలు కనిపించడం లేదు. రైడ్ 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అజయ్ దేవగన్‌తో పాటు హీరోయిన్‌ వాణి కపూర్ ఇతర యూనిట్‌ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. తాజా మీడియా సమావేశంలో హీరోయిన్‌ విషయమై మీడియా నుంచి ప్రశ్న వచ్చింది.

మొదటి పార్ట్‌లో అజయ్‌ దేవగన్‌కి జోడీగా ఇలియానా నటించింది. కథకు కొనసాగింపు, పాత్రలు సైతం కొనసాగే సినిమాలకు ఎక్కువ శాతం నటీ నటులను కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ లెక్కన రైడ్‌ 2 సినిమాలో హీరోయిన్‌గా ఇలియానా నటించాల్సి ఉంటుంది. కానీ ఆమె ఆకుండా వాణీ కపూర్‌ను హీరోయిన్‌గా నటింపజేశారు. ఆ విషయమై మీడియా వారు ప్రశ్నించిన సమయంలో అజయ్ దేవగన్‌ స్పందిస్తూ.. మీరు హాలీవుడ్‌లో ఎన్నో ప్రాంచైజీ సినిమాలు చూసి ఉంటారు. అందులో పాత్ర సేమ్‌ ఉంటుంది... కానీ అందులో నటించే నటీ నటులు వేరుగా ఉంటారు. రైడ్ 2 సినిమా విషయంలోనూ అదే జరిగింది. అజయ్ దేవగన్ సమాధానం సరిగా లేదంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

తాజా మీడియా సమావేశంలో హీరోయిన్ వాణీ కపూర్ మాట్లాడుతూ... రైడ్‌ 1 సినిమాలో నటించిన హీరోయిన్‌పై తనకు ఎలాంటి ఈర్ష్య లేదు. పై పెచ్చు ఆమెతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సినిమా కథను నా వద్దకు రచయిత, దర్శకుడు తీసుకు వచ్చిన సమయంలో పాత్ర తీరును గురించి ఆలోచించాను. తప్పకుండా ఇది తన కెరీర్‌లో నిలిచి పోయే పాత్రగా నిలుస్తుంది అనే నమ్మకం కలగడం వల్ల నటించేందుకు ఒప్పుకున్నాను. అయితే సీక్వెల్‌లో ఇంతకు ముందు నటించిన హీరోయిన్‌ పాత్రలో నటించడం అనేది ముందస్తుగా క్లారిటీ లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది.