Begin typing your search above and press return to search.

యుద్దం చేయనున్న రాధేశ్యామ్‌ డైరెక్టర్‌..!

రాధాకృష్ణ తో జిల్ మరియు రాధేశ్యామ్‌ సినిమాలను నిర్మించిన యూవీ క్రియేషన్స్ వారు మరో అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 4:21 AM GMT
యుద్దం చేయనున్న రాధేశ్యామ్‌ డైరెక్టర్‌..!
X

గోపీచంద్ తో జిల్ సినిమాను రూపొందించి స్టైలిష్ దర్శకుడిగా పేరు దక్కించుకున్న దర్శకుడు రాధాకృష్ణ. రెండో సినిమానే ప్రభాస్ తో చేసే అవకాశం ను దక్కించుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి పాన్‌ ఇండియా స్టార్‌ డమ్ దక్కింది. ఆ స్థాయిలో ఉండే విధంగా ప్రభాస్ తో రాధేశ్యామ్‌ సినిమాను రూపొందించాడు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధేశ్యామ్‌ సినిమాను దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్‌ తో రాధాకృష్ణ రూపొందించాడనే విషయం తెల్సిందే. ఆ సినిమా కమర్షియల్ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెల్సిందే. కనీసం వంద కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేక పోయిందని బాక్సాఫీస్ వర్గాల టాక్‌. దాంతో దర్శకుడు రాధాకృష్ణ కనిపించకుండా పోయాడు.

మొదటి రెండు సినిమాలు కూడా నిరాశ పరచడం.. ముఖ్యంగా రాధేశ్యామ్‌ భారీ డిజాస్టర్ గా నిలవడంతో రాధాకృష్ణ మళ్లీ సినిమాలు చేస్తాడా.. హీరోలు ఈయనతో సినిమాలకు ఓకే అంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో రాధాకృష్ణ కు ఓ ఛాన్స్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రాధాకృష్ణ తో జిల్ మరియు రాధేశ్యామ్‌ సినిమాలను నిర్మించిన యూవీ క్రియేషన్స్ వారు మరో అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. గోపీచంద్‌ హీరోగా యుద్దం నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ సినిమాను రాధాకృష్ణ ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. అందుకోసం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయ్యింది.

సినిమా కథానుసారం ఎక్కువ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించాల్సి ఉంటుందట. అందుకే ఈ సినిమాకు యూవీ క్రియేషన్స్ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. జిల్ మరియు రాధేశ్యామ్‌ సినిమా ఫలితాల తర్వాత కూడా రాధాకృష్ణ పై నమ్మకంతో అంత బడ్జెట్‌ కు సిద్దం అవ్వడం విశేషం.

ఈసారి గోపీచంద్ కి హిట్ ఇవ్వడంతో పాటు తాను ట్యాలెంటెడ్‌ దర్శకుడిని అని రాధాకృష్ణ నిరూపించుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడని తెలుస్తోంది. గోపీచంద్‌ కెరీర్ లో అత్యంత ఖరీదైన సినిమాగా ఈ సినిమా నిలుస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.