Begin typing your search above and press return to search.

ఉస్తాద్ కోసం ఆ అగ్ర హీరోలు రాగలరా?

మరికొంతమంది యంగ్ హీరోలను కూడా పిలవాలని చూస్తోందట. ఆ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   8 Dec 2023 5:27 AM GMT
ఉస్తాద్ కోసం ఆ అగ్ర హీరోలు రాగలరా?
X

సినిమా స్టార్లందరూ ఓటీటీల వైపు చూస్తున్న ఈ కాలంలో మరో టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ కూడా ఈటీవీ విన్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. ఉస్తాద్ పేరుతో ఓ కొత్త సెలబ్రిటీ టాక్ షో చేయబోతున్నారు. డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ షో స్ట్రీమింగ్ కానుండగా అందుకు సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదలై ఆసక్తి రేపుతోంది.

ఈ షో కోసం ఇప్పటికే యూనిట్.. పలువురు హీరోలను గెస్ట్ లుగా రప్పించి షూట్ పూర్తి చేసిందట. మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో అడవి శేష్ పై షూట్ కంప్లీట్ చేసిందట. మరికొంతమంది యంగ్ హీరోలను కూడా పిలవాలని చూస్తోందట. ఆ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు నెట్టింట కొత్త చర్చ మొదలైంది. తారక్, రామ్ చరణ్ ఈ షోకు రాగలరా అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న వీరిద్దరు ఇప్పుడు సినిమా షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఓ వైపు దేవరలో నటిస్తుండగా.. చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత కూడా వీరిద్దరి కాల్షీట్లు ఫుల్ బిజీగా ఉన్నాయి. తారక్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనుండగా.. చరణ్ బుచ్చిబాబుతో మూవీలో నటించనున్నారు. మరికొందరు మాత్రం షూటింగ్స్ కు చిన్న బ్రేక్ ఇచ్చి వీరిద్దరు మనోజ్ షోకు వస్తారని అంటున్నారు.

మరోవైపు, మనోజ్ మాత్రం ఈ షో ద్వారా మంచు ఫ్యాన్స్ కు రిటర్న్ గిప్ట్ ఇస్తానని చెబుతున్నారు."నేను మీ మనోజ్. నా కథ మీరు రాసుకున్నది, నా రాక మీరు పిలుస్తున్నది. ప్రతి హీరోని నడిపించే సైన్యం ఫ్యాన్స్. ప్రతి స్టారూ సంపాదించుకునే ధైర్యం ఫ్యాన్స్. అలాంటి ఫ్యాన్స్ కు నేను ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్టే ఉస్తాద్" అని మనోజ్ ప్రోమో లో చెప్పారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. తెలుగు ఓటీటీల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం కోసం ఆరాటపడుతున్న ఈటీవీ విన్ ఈ కొత్త షోపై ఆశలు పెట్టుకుంది.

అయితే టాలీవుడ్​ హీరోలు షోస్​ కు హోస్ట్​లుగా వ్యవహరించడం ఇదేం కొత్తకాదు. ఇది వరకే తెలుగు టాప్​ హీరోలు జూనియర్ ఎన్​టీఆర్ (బిగ్​బాస్ తెలుగు సీజన్ 1, మీలో ఎవరు కోటీశ్వరుడు), నేచురల్ స్టార్ నాని (బిగ్​బాస్ సీజన్ 2), రానా దగ్గుబాటి (No.1 యారి), మెగాస్టార్ చిరంజీవి (మీలో ఎవరు కోటీశ్వరుడు), నాగార్జున అక్కినేని (బిగ్​బాస్ సీజన్ 3 నుంచి), నందమూరి బాలకృష్ణ (అన్​స్టాపబుల్ టాక్ షో) హోస్ట్​లుగా చేశారు.